
కథలాపూర్, వెలుగు: కథలాపూర్ మండల పర్యటనకు వచ్చిన వేములవాడ ఎమ్మెల్యే రమేశ్బాబు కాన్వాయ్ను ఎమ్మార్పీఎస్ లీడర్లు అడ్డుకున్నారు. సోమవారం మండలంలోని చింతకుంటలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు జడ్పీ చైర్మన్వసంతతో కలిసి ఎమ్మెల్యే బయలుదేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాన్వాయ్ ను ఎమ్మార్పీఎస్ లీడర్లు అడ్డుకున్నారు. వారు మాట్లాడుతూ తక్కలపల్లిలో నెల కింద దళిత యువకుడు అనుమానాస్పదంగా చనిపోతే, బాధిత కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అతని మృతిపై వాస్తవాలు కూడా తేల్చలేదని ఆరోపించారు. చింతకుంటలో అంబేడ్కర్ విగ్రహం గద్దెకు బీఆర్ఎస్ జెండాలు కట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళనకారులను సీఐ ప్రవీణ్కుమార్, ఎస్సై శ్వేత , సిబ్బంది పక్కకు లాక్కెళ్లారు.