- తవ్వకాలకు కాల్ బిఫోర్ యు డిగ్ యాప్ : సీఎస్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో 97.7% గ్రామాలు మొబైల్ కనెక్టివిటీతో ఉన్నా యని సీఎస్ శాంతికుమారి తెలిపారు. దేశంలో 5జీని ప్రారంభించిన అతికొద్ది రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని చెప్పారు. సీఎస్అధ్యక్షతన మంగళవారం స్టేట్ బ్రాడ్బ్యాండ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ మీటింగ్లో టెలికాం రంగంలో మౌలిక సదుపాయాలకు సంబంధించిన ఇంటర్ డిపార్ట్ మెంటల్ సమస్యలపై చర్చించారు. అనేక టెలికాం సూచికలలో తెలంగాణ ఇతర రాష్ట్రాల కంటే చాలా ముందుందని సీఎస్ పేర్కొన్నారు.
దాదాపు 3.5 కోట్ల జనాభాకు నాలుగు కోట్లకు పైగా మొబైల్ కనెక్షన్లతో టెలి-సాంద్రత (107%) దేశంలోనే అత్యధికంగా ఉందన్నారు. పెండింగ్లో ఉన్న రైట్ ఆఫ్ వే దరఖాస్తుల పరిస్థితిపై సమావేశంలో సమీక్షించారు. 5జీ సేవలను వేగవంతం చేసేందుకు వర్కింగ్ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలో ఎక్కడైనా, ఏ రకమైన తవ్వకాలకైనా “కాల్ బిఫోర్ యు డిగ్” (సీబీయూడీ) యాప్ ద్వారా ముందస్తు సమాచారం అందించాలని సమావేశంలో నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని ఇంజినీరింగ్ విభాగాలు ముందుగా యాప్ను ఉపయోగించేలా ఆదే శాలు జారీ చేయాలని సీఎస్ కోరారు.