కరోనావైరస్ కారణంగా పాఠశాలలన్నీ ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నాయి. అయితే క్లాసుల కోసం మొబైల్ ఫోన్లు కొనలేని పేద విద్యార్థులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారికోసం ముంబై మున్సిపల్ & ప్రైవేట్ ఉర్దూ టీచర్స్ యూనియన్ వినూత్నంగా ఆలోచించింది. ఒకటి నుంచి పదవ తరగతి విద్యార్థుల కోసం ఇమామ్వాడ ప్రాంతంలో ఉచిత మొబైల్ ఫోన్ లైబ్రరీని ప్రారంభించింది. మొబైల్ ఫోన్ కొనలేని పేద విద్యార్థులు ఇక్కడ ఆన్లైన్ తరగతులకు హాజరవుతున్నారు. ఈ సదుపాయాన్ని ఇప్పటివరకు 22 మంది విద్యార్థులు ఉపయోగించుకుంటున్నారు.
‘కొంతమంది విద్యార్థులకు మొబైల్ ఫోన్లు లేవు. వారి కుటుంబంలో ఒక్కరికే మొబైల్ ఫోన్ ఉంది. అలాంటి వారి కోసం మేం దీన్ని ప్రారంభించాం. ఉపాధ్యాయులు ఆన్లైన్లో బోధిస్తుండటంతో విద్యార్థల సిలబస్ పూర్తవుతోంది. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు తరగతులు జరుగుతాయి. ఇక్కడ కూడా మేం కరోనా నిబంధనలను ఖచ్చితంగా అమలు చేస్తున్నాం’ అని ఇమామ్వాడ సెంటర్ సెంటర్ ఇన్ఛార్జ్ షాహినా సయీద్ తెలిపారు. ప్రస్తుతం ఈ సెంటర్లో 10 స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. వీటికోసం ప్రత్యేకంగా వైఫై సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేశారు.
For More News..