- 24 శాతం పిల్లలు ఫోన్లు చూస్తూ నిద్రపోతున్నరు
- ఫోన్ల యూసేజ్తో ఏకాగ్రత లోపం, కోపం, చిరాకు సమస్యలు
- రాష్ట్రంలో 41% మంది పిల్లలకు సోషల్ నెట్వర్కింగ్ అకౌంట్స్
- వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వాడే వాళ్లే ఎక్కువ
- ఎస్సీపీసీఆర్ సర్వేలో ఆసక్తికర విషయాలు
హైదరాబాద్, వెలుగు: పిల్లలు పుట్టిన ఆర్నెల్లు, ఏడాది నుంచే సెల్ఫోన్లకు అలవాటు పడుతున్నరు. వారు ఏడిస్తే ఊకుంచాలన్నా.. అన్నం తినాలన్నా.. వాళ్ల చేతికి స్మార్ట్ ఫోన్ ఇయ్యాల్సిందే. జింగిల్స్, కార్టూన్ వీడియోలు పెట్టకపోతే ఒక్క బుక్క కూడా మింగని పరిస్థితి నెలకొంది. కరోనా ఎఫెక్ట్తో మొదలైన ఆన్లైన్ క్లాసులు పిల్లలకు మొబైల్స్ ను మరింత దగ్గర చేశాయి. ఎనిమిదేండ్ల వయసున్న పిల్లలకే సొంతంగా స్మార్ట్ఫోన్లు ఉంటున్నాయని నేషనల్ కమిషనర్ ఫర్ ప్రొటెక్టింగ్ చైల్డ్ రైట్స్(ఎన్సీపీసీఆర్) సర్వే తెలిపింది. ఎనిమిదేండ్ల వయసున్న19 శాతం మంది, 8 నుంచి-18 ఏండ్ల వయసున్న 30.2 శాతం మంది పిల్లలకు సొంతంగా ఫోన్లు ఉన్నాయని ఎన్సీపీసీఆర్సర్వేలో తేలింది.
ఏకాగ్రత సమస్యలు..
డబ్ల్యూహెచ్వో నిబంధనల ప్రకారం పిల్లలు ఒక రోజులో రెండు గంటలకు మించి సెల్ఫోన్లు వాడకూడదు. కానీ చాలా మంది పిల్లలు అంతకన్నా ఎక్కువ సమయమే ఫోన్లో ఉంటున్నారు. ఆన్లైన్ క్లాసుల పేరిట కొన్ని గంటలు, ఎంటర్టైన్మెంట్ పేరిట మరికొన్ని గంటలు సెల్ఫోన్లలో గడిపేస్తున్నారు. ఎన్సీపీసీఆర్ సర్వే ప్రకారం 24% మంది పిల్లలు స్మార్ట్ఫోన్ చూస్తూ నిద్రపోతున్నట్లు తేలింది. 37.15% మంది పిల్లలు నిత్యం ఫోన్లు వాడుతూ.. ఏకాగ్రత, జ్ఞాపకశక్తికి సంబంధించిన సమస్యలు ఎదుర్కొంటున్నట్లు సర్వేలో వెల్లడైంది. పరిమితికి మించిన స్క్రీన్ టైమ్తో పిల్లల్లో కోపం, చిరాకు బాగా పెరుగుతాయని డాక్టర్లు అంటున్నారు. అయితే, స్మార్ట్ఫోన్లతో తమలో క్రియేటివిటీ బాగా పెరిగిందని 31.50 శాతం పిల్లలు సర్వేలో తమ అభిప్రాయాలు పంచుకున్నారు.
వాట్సాప్, ఇన్స్టా, ఫేస్బుక్..
30 శాతం పిల్లలు తమ సొంత ఫోన్లనే ఆన్లైన్ క్లాసులు, ఇతర ఎంటర్టైన్మెంట్ కోసం వాడుతుంటే 62.6 శాతం పిల్లలు వారి పేరెంట్స్ ఫోన్లు యూజ్ చేస్తున్నారు. ఇందులో 95 శాతం పిల్లలు తాము ఆన్లైన్ క్లాసుల కోసమే సెల్ఫోన్లు వాడుతున్నామని చెబుతున్నా, తమకు ఇష్టమైన ఫీచర్ ‘చాటింగ్’ అని అంటున్నారు. చాటింగ్ యాప్లైన వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లతోపాటు మరికొన్నింటిని పిల్లలు బాగా వాడుతున్నారు. ఎన్సీపీసీఆర్ దేశంలోని వివిధ పట్టణాల్లో చేసిన సర్వేలో తెలంగాణ కూడా ఉంది. హైదరాబాద్లో కొందరు పిల్లల నుంచి తమ సర్వేలో భాగంగా అభిప్రాయాలు సేకరించారు. మొబైల్లో తమకు చాటింగ్ ఇష్టమని 52.9 శాతం పిల్లలు చెబితే, 44.10 శాతం మంది మ్యూజిక్, 31.9 శాతం గేమింగ్ ఫీచర్లు ఇష్టమని చెప్పారు. కాగా 10.1 శాతం మంది పిల్లలే తాము స్మార్ట్ఫోన్లను ఆన్లైన్ క్లాసులు, స్టడీ మెటీరియల్ కోసం వాడటానికి ఇష్టపడుతున్నట్లు తెలిపారు.
సోషల్ నెట్ వర్కింగ్ అకౌంట్స్
సెల్ఫోన్ అల్టిమేట్ ఎంటర్టైన్మెంట్ డివైజ్ అని చెబుతున్న పిల్లల్లో 42.90 శాతం మందికి తమ సొంత సోషల్ నెట్వర్కింగ్ అకౌంట్లు ఉంటున్నాయి. ఇందులో 36.8 శాతం మందికి ఫేస్బుక్, 45.50 శాతం మందికి ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు ఉన్నాయి. తెలంగాణలో 41.30 శాతం పిల్లలకు వివిధ ప్లాట్ఫామ్లలో తమ సొంత అకౌంట్లు ఉన్నాయి. పదేండ్ల వయసు పిల్లల్లో 62.1% పిల్లలు సొంత అకౌంట్లు ఉన్నాయని చెప్పడం గమనార్హం. వాస్తవానికి సోషల్ మీడియా కంపెనీలు13 ఏళ్లు నిండిన వారికి మాత్రమే సొంత అకౌంట్లు క్రియేట్ చేసుకునే అవకాశం కల్పించాలి. కానీ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఎక్కువ సేపు స్మార్ట్ఫోన్ వాడడం వల్ల మానసికమైన సమస్యలతోపాటు సోషల్ డెవలప్మెంట్ సమస్యలు కూడా వస్తున్నాయని పేర్కొంది. సోషల్ మీడియా ద్వారా సైబర్ నేరాలు జరుగుతున్నందున పిల్లలు తెలిసీ తెలియక అందులో చిక్కుకునే ప్రమాదం ఉందంటోంది. అందుకే పిల్లలకు సెల్ఫోన్ ఇవ్వడంతోపాటు దాన్ని ఎలా వాడాలో నేర్పించాలని పేరెంట్స్, టీచర్స్కి సూచించింది. తమ చుట్టుపక్కల ప్లే గ్రౌండ్లు అందుబాటులోకి తెచ్చి పిల్లలను స్మార్ట్ఫోన్ అడిక్షన్ నుంచి దూరం చేయాలని సూచించింది. ఎయిమ్స్ బిహేవియరల్ అడిక్షన్ క్లినిక్ తరహాలో దేశంలో అక్కడక్కడా ఇంటర్నెట్ డీఅడిక్షన్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ఎన్సీపీసీఆర్ రికమండ్ చేసింది.