మూడు రైల్వే స్టేషన్ల ఆధునీకరణ.. ప్రతీ స్టేషన్​కు రూ. 20 కోట్లు ఖర్చు చేసేలా ప్లాన్​

మూడు రైల్వే స్టేషన్ల ఆధునీకరణ.. ప్రతీ స్టేషన్​కు రూ. 20 కోట్లు ఖర్చు చేసేలా ప్లాన్​

పెద్దపల్లి, వెలుగు: అమృత్​ భారత్​ స్కీం లో భాగంగా రైల్వే స్టేషన్లను సెంట్రల్​ గవర్నమెంట్​ అభివృద్ధి చేస్తోంది. ఈ స్కీమ్​కు ఉమ్మడి జిల్లా నుంచి  పెద్దపల్లి, రామగుండం, కరీంనగర్​ రైల్వే స్టేషన్లు ఎంపికయ్యాయి.    రాష్ట్ర వ్యాప్తంగా 39 స్టేషన్లు ఎంపిక కాగా  ఉమ్మడి జిల్లా స్టేషన్లకు చోటు దక్కడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ పథకంలో భాగంగా ఎంపికైన స్టేషన్ల అభివృద్ధకి  రూ. 20 కోట్ల అందుతాయి.  ప్రతీ రైల్వే స్టేషన్లలో ఇన్​ ఫ్రాస్ట్రక్చర్​కే ప్రాధాన్యం ఇవ్వనున్నారు. రైల్వే స్టేషన్లలో ప్రయాణికులకు అనుకూలమైన వాతావరణం కల్పించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు.   

ఇన్​ఫ్రాస్ట్రక్చర్​కే ఇంపార్టెన్స్​...

 రామగుండం, పెద్దపల్లి రైల్వే స్టేషన్ల మీదుగా నిత్యం రైళ్లు వెళ్తుంటాయి. రామగుండం పారిశ్రామిక ప్రాంతం కావడంతో ఇక్కడ నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లే వారు రైలు ప్రయాణం మీదనే ఆధారపడుతున్నారు. ఈ స్టేషన్లలో మౌలికసదుపాయాలు సరిగ్గా లేకపోవడంతో గతం నుంచి ప్రయాణికులు పలు ఇబ్బందులు పడుతున్నారు. అమృత్​భారత్​ నిధుల ద్వారా ఈ మూడు స్టేషన్లు అభివృద్ది చెందటంతో పాటు మౌలికసదుపాయాల కల్పన జరుగుతుంది.  రైల్వే డివిజనల్​ మేనేజర్లతో ప్రత్యేకనిధిని ఏర్పాటు చేస్తారు. ఈ స్కీం ద్వారా స్టేషనల్లో రూఫ్​ప్లాజాలు ఏర్పాటు చేయనున్నారు. రైల్వేస్టేషన్లలో ప్రయాణికులకు ప్రత్యేక అనుభూతిని అందించడానికి అవసరమైన ఏర్పాట్లు చేయనున్నారు. 

సంవత్సరంలోపే పనులన్నీ పూర్తయ్యేలా ప్లాన్​ చేశారు. రైల్వేస్టేషన్ల ఎంట్రెన్స్​లు, రైల్వేట్రాకులను మాడ్రనైజ్​ చేయడం, వెయిటింగ్​ రూంల ఏర్పాటు, పార్కింగ్​ స్థలాలనుపెంచడం, ఆధునిక లైటింగ్, రైళ్ల రాకపోకలు తెలిసేలా డిజిటల్​ బోర్డులు, దివ్యాంగుల కోసం ప్రత్యేక​ ఏర్పాటు లాంటివి ఈ స్కీం ద్వారా ఏర్పాటు చేయనున్నారు.ఎంపిక కావడం సంతోషంరామగుండం, కరీంనగర్​ రైల్వేస్టేషన్ల ను  అభివృద్ధి చేసేందుకు బీజేపీ ప్రభుత్వం ఎంపిక చేయడం సంతోషంగా ఉంది. ఈ స్టేషన్ల నుంచి  నుంచి వేల సంఖ్యలో ప్రయాణికులు ఇతర ప్రాంతాలకు  పోతుంటారు.   ఇక్కడి నుంచి  ఎక్కువ మంది ఢిల్లీ, ముంబాయి కి  రైళ్లున్నాయి.  ఏండ్ల నుంచి చూస్తున్న. గతంలో ఈ స్టేషన్లలో సరైన సౌకర్యాలు లేవు.   ఇప్పుడు అమృత్​ భారత్​ స్కీం ద్వారా ఈ స్టేషన్లు అభివృద్ధి కావడం సంతోషంగా ఉంది. 

-  సయ్యద్​ సజ్జాద్​, స్థానికుడు, పెద్దపల్లి