
న్యూఢిల్లీ: రాజ్ఘాట్ కాంప్లెక్స్లో మాజీ ప్రెసిడెంట్ ప్రణబ్ ముఖర్జీ స్మారకం కోసం కేటాయించిన స్థలం పక్కనే మన్మోహన్ సింగ్ మెమోరియల్ ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ విషయాన్ని మన్మోహన్ కుటుంబానికి తెలియజేసి, వారి అంగీకారం కోరిందని అధికారవర్గాలు మంగళవారం తెలిపాయి. తర్వాతి ప్రక్రియ కోసం ట్రస్ట్ను ఏర్పాటు చేయాలని మన్మోహన్ కుటుంబ సభ్యులను సంబంధిత మంత్రిత్వ శాఖ కోరిందని వెల్లడించాయి. వారు ట్రస్ట్ ఏర్పాటు చేయగానే మెమోరియల్ నిర్మాణం కోసం భూమి, రూ.25 లక్షలు కేంద్రం కేటాయించనుందని పేర్కొన్నాయి.