కాశీ ఆలయ అభివృద్ధికి ప్రధాని మోడీ శంకుస్థాపన

కాశీ ఆలయ అభివృద్ధికి ప్రధాని మోడీ శంకుస్థాపన

ప్రధాని నరేంద్ర మోడీ కాశీ విశ్వనాథ్‌ ఆలయ విస్తరణ, సుందరీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. భారత వైమానికదళ విమానంలో మోడీ ఇవాళ (శుక్రవారం) ఉదయం తన పార్లమెంట్‌ నియోజకవర్గమైన వారణాసికి చేరుకున్నారు. లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ప్రధానికి ఆ రాష్ట్ర గవర్నర్ రాం నాయక్, సీఎం యోగీ ఆదిత్యానాథ్ ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి బయల్దేరిన ప్రధాని వారణాసి కాశీ విశ్వనాథ్ ఆలయానికి చేరుకున్నారు. 40 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఆలయం పేరు మీదుగా ఐదు ఇటుకలు పేర్చి పనులను ప్రారంభించారు. మొత్తం నాలుగు దశల్లో ఆలయ అభివృద్ధిని చేపట్టనున్నారు. తర్వాత ప్రధాని కాశీ విశ్వేశ్వరుడి పూజలో పాల్గొన్నారు. గవర్నర్, సీఎంతో పాటు ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మహేంద్రనాథ్ పాండే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.