మోడీ..ఐదేళ్ల క్రితం హామీని గుర్తు చేసుకోండి: రఘువీరా రెడ్డి

మోడీ..ఐదేళ్ల క్రితం హామీని గుర్తు చేసుకోండి: రఘువీరా రెడ్డి

ప్రత్యేక హోదాపై ప్రధాని మోడీకి  ట్విట్టర్లో ప్రశ్నలు సంధిస్తూ ఓ వీడియో పోస్ట్ చేశారు ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి. ఈ నెల 9న మోడీ తిరుపతికి వస్తున్నందుకు స్వాగతం చెబుతూ.. సరిగ్గా ఐదేళ్ల క్రితం ఎన్నికల ప్రచారంలో  ఏపీకి పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తానన్న హామీని మోడీ గుర్తు చేసుకోవాలని  సూచించారు. కారణాలు ఏవైనా ..బాధ్యులెవరైనా ఇంతవరకూ ఏపీకి హోదా రాలేదన్నారు. ఐదేళ్లు గడిచపోయాయని..ఇప్పటి వరకు ఏపీ పరిస్థితి ఏమాత్రం బాగలేదన్నారు. దయచేసి మోడీ ఏపీకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని..హోదా అమలు చేయాలని ఏపీ ప్రజల తరపున విజ్ఞప్తి చేశారు. సీఎం జగన్ కూడా హోదాపై మోడీకి విజ్ఞప్తి చేసి హోదా సాధించాలని కోరారు రఘువీరా రెడ్డి.