మెహిదీపట్నం, వెలుగు: డ్రగ్స్కు యువత దూరంగా ఉండాలని మంత్రి అజారుద్దీన్ పిలునిచ్చారు. శనివారం టప్పాచబుత్ర పరిధిలో కాంగ్రెస్ నాయకులు ఏర్పాటు చేసిన యాంటీ డ్రగ్స్ అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
డ్రగ్స్కు బానిసైతే జీవితం నాశనం అవుతుందని హెచ్చరించారు. కార్యక్రమంలో సందీప్ శాండిల్య, గోల్కొండ జోన్ డీసీపీ చంద్రమోహన్, విద్యార్థులు, స్థానికులు పాల్గొన్నారు.
