- మంచు మోహన్బాబు, విష్ణు చిత్ర హింసలు పెట్టిన్రు
- సెల్ఫీ వీడియోలో హెయిర్ స్టైలిస్ట్ నాగ శ్రీను
ఖైరతాబాద్, వెలుగు: మంచు విష్ణు ఆఫీస్లో తాను ఎలాంటి చోరీ చేయలేదని, కావాలనే తనపై అక్రమ కేసు పెట్టారని హెయిర్ స్టైలిస్ట్ నాగ శ్రీను తెలిపాడు. సోమవారం ఓ సెల్ఫీ వీడియో రిలీజ్ చేశాడు. తాను మంచు వాళ్ల ఆఫీసులో పదేండ్లుగా పనిచేస్తున్నానని, మంచు మోహన్బాబు, విష్ణు గత నెల 17న మధ్యాహ్నం తనను మోకాళ్లపై కూర్చోబెట్టి కులం పేరుతో చెప్పుకోలేని విధంగా తిట్టారని ఆరోపించాడు. అదంతా అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డ్అయ్యిందని చెప్పాడు. తనపై కేసు పెట్టారని తెలిసి తన తల్లికి హార్ట్స్ట్రోక్వచ్చిందని బాధపడ్డాడు. ప్రస్తుతం ఆమె హాస్పిటల్లో ఉందని వాపోయాడు. నోటికొచ్చినట్లు తిట్టడంతోనే తాను పని మానేశానని చెప్పాడు. తాను ఎలాంటి చోరీ చేయలేదని తెలిపాడు. కాగా రూ.5లక్షల విలువైన హెయిర్డ్రెస్సింగ్ సామగ్రిని నాగశ్రీను చోరీ చేశాడని ఎస్వీఈటీ సంస్థ లీగల్ మేనేజర్ సందీప్ బంజారాహిల్స్ పోలీసులకు కంప్లైంట్ చేసిన సంగతి తెలిసిందే.