న్యూయార్క్: ‘‘ఉక్రెయిన్లో పరిస్థితి ఏం బాగాలేదు. ఇక్కడ నిజమైన యుద్ధం జరుగుతోంది. నాకు భయంగా ఉంది. ఇక్కడ అన్ని సిటీలపై మేము బాంబులు వేస్తున్నాం. సాధారణ ప్రజలను కూడా టార్గెట్ చేయాల్సివస్తోంది. ఉక్రెయిన్ ప్రజలు వెల్కమ్ చెప్తారని అధికారులు మాకు చెప్పారు. కానీ ఇక్కడి జనాలు మా యుద్ధ ట్యాంకుల కింద పడి మమ్మల్ని అడ్డుకుంటున్నారు. మమ్మల్ని ఫాసిస్ట్లు అని అంటున్నారు”.. ఉక్రెయిన్లో చనిపోయే ముందు రష్యా సైనికుడు తన తల్లికి పంపిన చివరి మెసేజ్ ఇది. ఈ మెసేజ్ను ఉక్రెయిన్ అంబాసిడర్ సెర్గీ కిస్లిత్సా మంగళవారం జరిగిన యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ మీటింగ్లో చదివి వినిపించారు. రష్యా సైనికుడు తన తల్లితో చేసిన చాటింగ్ ఇది, ఆ తర్వాత కొద్ది సేపటికే ఉక్రెయిన్ దళాల కాల్పుల్లో ఆ సైనికుడు చనిపోయాడు అని సెర్గీ తెలిపారు. దీనిని బట్టి ఉక్రెయిన్లో రష్యన్ సైనికుల పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోవచ్చని ఆయన అన్నారు. పుతిన్ నిర్ణయం వల్ల ఎంతో మంది రష్యా సైనికులు కూడా ప్రాణాలు కోల్పోతున్నారని, ఇప్పటికైనా ఈ దాడులను ఆపాలని సెర్గీ కోరారు.
ICYMI - Watch complete speech here: https://t.co/fXrpjcxrox#UNGA https://t.co/vK1uKVFRJv
— CSPAN (@cspan) March 1, 2022