న్యూఢిల్లీ: రాజ్యసభలో సోమవారం ప్రశ్నోత్తరాల సమయంలో డిప్యూటీ చైర్మన్ హరివంశ్ చైర్లో ఉన్నారు. మంత్రులు సమాధానాలు ఇచ్చే టైమ్లో ‘ఏవియేషన్ సెక్టార్’పై సభ్యులు అడిగిన 18వ ప్రశ్నను స్కిప్ చేశారు. 17వ ప్రశ్న తర్వాత డైరెక్ట్గా పోలవరంపై ప్రాజెక్టుపై అడిగిన 19 ప్రశ్నను ప్రస్తావించారు.
దీంతో సభలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. 18వ ప్రశ్నను స్కిప్చేయడానికి కారణాలేంటని ఎస్పీ ఎంపీ జయాబచ్చన్, కాంగ్రెస్ ఎంపీ దీపేంద్ర సింగ్ హుడా ప్రశ్నించారు. అది అనుకోకుండా జరిగిందని డిప్యూటీ చైర్మన్ హరివంశ్ తెలిపారు. ఈ సమాధానంతో ప్రతిపక్ష పార్టీల సభ్యులు కన్వీన్స్ కాలేదు.