మనీలాండరింగ్ కేసు: జార్ఖండ్ సీఎంకు మరోసారి ఈడీ నోటీసులు

మనీలాండరింగ్ కేసు: జార్ఖండ్ సీఎంకు మరోసారి ఈడీ నోటీసులు

రాంచీ: మనీలాండరింగ్ కేసులో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్ కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ శనివారం (జనవరి 27) మరోసారి నోటీసులు జారీ చేసింది.జనవరి 29 న లేదా జనవరి 31 న విచారణకు ఈడీ ముందు హాజరు కావాలని నోటీసులో పేర్కొంది. 

అంతకుముందు జనవరి 13న జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్ కు ఈడీ ఎనిమిదోసారి నోటీసులు జారీ చేసింది. ఈడీ నుంచి తనకు నోటీసులు అందాయని.. సరైన సమయంలో సమాధానం చెబుతానని సోరేన్ చెప్పినట్లు తెలుస్తోంది. తాజాగా తొమ్మిదోసారి మనీలాండరింగ్ కేసులో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్ కు నోటీసులు జారీ చేసింది న్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ED). జనవరి 29 నుంచి 31 మధ్య విచారణకు హాజరు కావాలని నోటీసులో తెలిపింది.