రాష్ట్రాన్ని పలకరించిన నైరుతి : జల్లుల్లో గిరిజనుల సంబురాలు

రాష్ట్రాన్ని పలకరించిన నైరుతి : జల్లుల్లో గిరిజనుల సంబురాలు

రాష్ట్రంపై ఇవాళ్టి నుంచి నైరుతి రుతుపవనాల ప్రభావం ప్రారంభం అయిందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రుతుపవనాలు స్థిరపడుతుండటంతో ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయన్నారు. రానున్న రెండు రోజుల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.

ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో ఇవాళ అక్కడక్కడా జల్లులు పడ్డాయి. హైదరాబాద్ లో వాతావరణం మధ్యాహ్నం తర్వాత చల్లబడింది. రాష్ట్రంలోని పలుచోట్ల చిరుజల్లులు పడటంతో… పల్లెల్లో ఆనందం కనిపించింది.

వర్షం – గిరిజనుల హర్షం

మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఇనుగుర్తి శివారు తండాలో చినుకులు పడ్డాయి. వర్షం పడటంతో సంబురాలు జరుపుకున్నారు గిరిజనులు.