
అమెరికాలోని నాష్విల్లే, టెన్నెసీ, ఇతర ప్రాంతాల్లో టోర్నడో సృష్టించిన బీభత్సానికి 24 మందికిపైగా చనిపోయారు. చాలా ప్రాంతాల్లో ఇళ్లు, భవనాలు ధ్వంసమయ్యాయి. నాష్విల్లేలోని జాన్ సి ట్యూన్ ఎయిర్పోర్టులోని పలు విమానాలు ధ్వంసమయ్యాయి. ఎయిర్పోర్ట్కు భారీగా ఆస్తి నష్టం జరిగిందని అధికారులు చెప్పారు.