అమెరికా నుంచి ఇంటికి చేరుకున్న చరితారెడ్డి మృతదేహం

అమెరికా నుంచి ఇంటికి చేరుకున్న చరితారెడ్డి మృతదేహం

అమెరికాలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన చరితారెడ్డి మృతదేహం ఆమె స్వగృహానికి చేరుకుంది. గత నెల డిసెంబర్ 27న అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆమె మృత దేహాన్ని ఆదివారం నేరేడ్‌మెట్​లోని రేణుక నగర్​కు తరలించారు. వారం రోజుల తరువాత మృత దేహం రావడంతో ఆమె తల్లిదండ్రులు, కుటుంబ సభ్యలు కన్నీరుమున్నీరవుతున్నారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు చరితారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

గత కొన్నేళ్ల క్రితం చదువుకోసం అమెరికాకు వెళ్లిన చరితారెడ్డి జాబ్​ వచ్చిన తరువాత అక్కడే స్థిర పడింది.  వారం రోజుల క్రితం అమెరికాలో ప్రమాదవశాత్తు ఆమె కారును మరో కారుతో ఢీ కొట్టడంతో రెండు రోజులు హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందింది.