
హైదరాబాద్ సిటీ, వెలుగు : నగరంలో దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఆర్.వి.కర్ణన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం (జూన్ 17) జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీసులో అడిషనల్, జోనల్, డిప్యూటీ కమిషనర్లు, మెడికల్ ఆఫీసర్లు(ఏఎంఓహెచ్), ఎంటమాలజీ అధికారులతో శానిటేషన్, దోమల నివారణ, ఆస్తిపన్ను వసూళ్లపై కమిషనర్ సమావేశం నిర్వహించారు. కర్ణన్మాట్లాడుతూ ఫాగింగ్ పై అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్దే పూర్తి బాధ్యత ఉంటుందన్నారు.
ఫాగింగ్సాయంత్రం 4 గంటల నుంచి10 గంటల వరకు చేయాలని, ఏఎల్ఓలు ఫీల్డ్లెవెల్లో యాంటీ లార్వా ప్రోగ్రామ్తో పాటు, ఉదయం, సాయంత్రం ఫాగింగ్ చేయాలని, ఫాగింగ్ కు పెట్రోల్, డీజిల్ కూపన్లు ఇవ్వబోమని, ప్రీ పెయిడ్ కార్డులు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ ప్రక్రియ ఖైరతాబాద్ జోన్ లో ప్రయోగాత్మకంగా చేపట్టగా సక్సెస్అయ్యిందన్నారు.
ఫాగింగ్ కు సర్కిల్ వారీగా అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్, జోనల్ స్థాయిలో ఎస్ఈ బాధ్యత తీసుకోవాలన్నారు. ఫాగింగ్ షెడ్యూల్డ్ గురించి కార్పొరేటర్ కు సమాచారం ఇవ్వాలన్నారు. పార్కు, చెరువులు, వాకింగ్ ట్రాక్ వద్ద కూడా ఫాగింగ్ చేయాలన్నారు. శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ వార్డుల వారీగా జరుగుతున్న నేపథ్యంలో చెత్తను సకాలంలో రాంకీ వాహనాల ద్వారా తరలించాలన్నారు.
మెయిన్ రోడ్డు పై కన్స్ట్రక్షన్అండ్ డిమాలిష్వేస్ట్గానీ, వాటర్ లాగింగ్ ఉండొద్దని, అనుమతులు లేని హోర్డింగులు ఉండొద్దన్నారు. రెసిడెన్షియల్ భవనాల్లో కమర్షియల్ యాక్టివిటీస్ చేస్తున్న వారిని గుర్తించాలని, లేకపోతే విజిలెన్స్ విచారణ చేసి గుర్తించి చర్యలు తీసుకుంటామని కమిషనర్కర్ణన్అధికారులను హెచ్చరించారు. కుక్కల స్టెరిలైజేషన్ పూర్తయిన తర్వాత రూల్స్పాటించాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
కుక్కల దత్తత కార్యక్రమాలు చేపట్టాలని, పెట్ డాగ్ లైసెన్స్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఫుడ్ పాయిజన్ కాకుండా మటన్, చికెన్ షాపులను ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి తనిఖీలు చేయాలని చీఫ్ వెటర్నరీ ఆఫీసర్ను ఆదేశించారు. అడిషనల్ కమిషనర్లు రఘు ప్రసాద్, పంకజ,జోనల్ కమిషనర్లు హేమంత్ కేశవ్ పాటిల్, అపూర్వ చౌహాన్, హేమంత్ సహదేవ్ రావు, రవి కిరణ్, వెంకన్న,డిప్యూటీ కమిషనర్లు, అసిస్టెంట్ మెడికల్ అధికారులు, ఎంటమాలజి అధికారులు పాల్గొన్నారు.