నిద్రలేస్తలేరని పిల్లలపై వేడి నీళ్లు పోసిన తల్లి

నిద్రలేస్తలేరని పిల్లలపై వేడి నీళ్లు పోసిన తల్లి

మెదక్​, (వెల్దుర్తి), వెలుగు:  మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం ఎల్కపల్లి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. ఉదయం నిద్ర లేవడం లేదని ఇద్దరు పిల్లలపై తల్లి వేడి నీళ్లు పోయడంతో వారు గాయాలతో విలవిల్లాడారు. ఎల్కపల్లి గ్రామానికి చెందిన ఎంచర్ల సాయిలు, సంతోష భార్యాభర్తలు. కొద్ది రోజులుగా వీరి కుటుంబంలో తరచూ గొడవలు జరుగుతుండగా,  పలుమార్లు కుల పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టి భార్యాభర్తలకు నచ్చజెప్పారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం కూతురు శ్రీనిధి, కొడుకు రిత్విక్ నిద్ర లేవడం లేదని ఆగ్రహించిన తల్లి సంతోష వారి మీద వేడినీళ్లు పోయడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఇద్దరినీ చికిత్స కోసం మెదక్ దవాఖానకు తరలించారు. రుత్విక్ పరిస్థితి విషమంగా ఉందని కుటుంబసభ్యులు తెలిపారు.