V6 News

మొరాయిస్తున్న ఆర్టీఏ పోర్టల్స్

మొరాయిస్తున్న ఆర్టీఏ పోర్టల్స్
  •  
  • పన్జేయని వాహన్,​ సారథి
  • ఎర్రర్, సర్వర్​ డౌన్​తో వాహనదారులకు తిప్పలు 
  • సోమవారం లోపు సెట్ ​అవుతుందన్న ఆర్టీవో 

 హైదరాబాద్​సిటీ, వెలుగు:  ఆర్టీఏ కొత్తగా ప్రారంభించిన పోర్టల్స్​లో సాంకేతిక సమస్యలు వాహనదారులను సతాయిస్తున్నాయి. ఆర్టీఏ ఆఫీసుల్లో సేవలన్నీ పారదర్శకంగా ఉండాలన్న లక్ష్యంతోనే వాహన్ పోర్టల్​తో పాటు ‘సారథి’ని తీసుకువచ్చారు. డ్రైవింగ్, పర్మినెంట్​ లైసెన్స్​కోసం సారథి, వాహనాల రిజిస్ట్రేషన్లు, లైసెన్స్​రెన్యూవల్స్, ఫిట్​నెస్​సర్టిఫికెట్ల జారీ కోసం వాహన్​ను అందుబాటులోకి తెచ్చారు. అయితే, టెక్నికల్ ఇష్యూస్​తో పోర్టల్స్​లో ఎర్రర్ అని, సర్వర్​డౌన్​అని​వస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని నేషనల్​ఇన్​ఫర్​మేషన్​కేంద్రం (ఎన్​ఐసీ) ద్వారా ఆర్టీఏ ఈ సేవలను నిర్వహిస్తుండగా, కొద్ది రోజులుగా సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. 

ఇవీ సమస్యలు..

ఇంతకుముందు ఆర్టీఏ ఆఫీసుల్లోనే ఆన్​లైన్​సేవలతో పాటు క్యాష్​పేమెంట్​అందుబాటులో ఉండేది. కానీ సారథి, వాహన్​ పోర్టల్స్​వచ్చాక పూర్తిగా ఆన్​లైన్​ద్వారానే ట్రాన్సాక్షన్స్​నిర్వహిస్తున్నారు. ఇందులో ప్రధానంగా లైసెన్స్​రెన్యూవల్​, ఫిట్​నెస్​సర్టిఫికెట్, యాజమాన్య మార్పిడి, వెహికల్​ట్రాన్స్​ఫర్​కోసం రోజూ ఆన్​లైన్​లో వందల సంఖ్యలో అప్లికేషన్లు వస్తాయి. అయితే, కొద్ది రోజులుగా అప్లై చేసుకోవడానికి మీ సేవా కేంద్రాలకు కానీ, ఆర్టీఏ ఆఫీసులకు కానీ వెళ్తే సర్వర్లు డౌన్​అని చూపిస్తోంది.

కొన్ని సైట్లు అసలే ఓపెన్​కావడం లేదు. ఒకవేళ ఓపెన్​అయి క్యాష్​పేమెంట్​చేస్తే మధ్యలోనే నిల్చిపోయి ఎర్రర్​వస్తోంది. దీంతో ఆఫ్​లైన్​లో క్యాష్​పేమెంట్​చేద్దామని ఆఫీసులకు వెళ్లినా తీసుకోవడం లేదని తెలంగాణ ఆటో సంఘాల జేఏసీ నేత సత్తిరెడ్డి తెలిపారు. దీనిపై ఖైరతాబాద్​ఆర్టీఓ ఆఫీసర్​ పురుషోత్తం రెడ్డిని సంప్రదించగా టెక్నికల్​ఇష్యూస్​వల్ల ఇబ్బందులు వస్తున్నది నిజమేనని, మీ సేవా కేంద్రాల్లోనే ఈ సమస్య ఉన్నదన్నారు. కొద్ది రోజులుగా రాష్ట్ర పరిధిలోని డేటాను ఈ పోర్టల్​లోకి అనుసంధానం చేస్తున్నామని, అందుకే ఇలా జరుగుతోందన్నారు. తమ దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరిస్తున్నామని, సోమవారం నాటికి సమస్య పరిష్కారం అవుతుందన్నారు.