ఎంపీ అరవింద్ ఓ జోకర్.. ఛీటర్

ఎంపీ అరవింద్ ఓ జోకర్.. ఛీటర్
  • టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి

హైదరాబాద్: నిజామాబాద్ ఎంపీ ధర్మపురి ఒక జోకర్.. చీటర్ అంటూ నిప్పులు చెరిగారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. అసెంబ్లీ సమావేశాలకు ముందు మీడియా పాయింట్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కుటుంబాన్ని తిట్టినవాళ్లెవరూ మిగల్లేదని ఆయన చెప్పారు. మంత్రి కేటీఆర్ ను బేవకూఫ్ అని అరవింద్ చేసిన వాఖ్యలు వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. బీజేపీ అంటే మొన్నటి వరకు బడా ఝూటా పార్టీ అని పేరుండేది.. బండి సంజయ్.. గుండు అరవింద్.. జోకర్ల  పార్టీగా ముద్రపడింది.. వీరు మెంటల్ గా మాట్లాడితే.. మెంటల్ నాయకులైపోతారని ఆయన ఎద్దేవా చేశారు.  మీరెంత, మీ బలమెంత, మీరు ఒక్కటి మాట్లాడితే మేం వెయ్యి మాట్లాడతాం..  సభలో మా బలం 103 మంది.. మీరు ఇద్దరున్నారు.  మీరు ఇటుకతో కొడితే.. మేము  రాయితో కొడతాము..రైల్వేలను అమ్ముతున్నారు. బీఎస్ఎన్ ఎల్ ను అమ్ముతున్నారు, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని అమ్ముతానన్నారు.. రేపు బీహెచ్ఈఎల్ తోపాటు.. సింగరేణిని కడా అమ్మడానికి ప్రయత్నం చేస్తారు.. హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్టును కూడా అమ్ముతున్నారు.. వీళ్లు ఎట్లా తయారయ్యారంటే.. బీజేపీ అంటేనే అమ్మకాల పార్టీ అయిపోయింది. బీజేపీ వాళ్లు ఏం చేస్తున్నారంటే.. ఏం లేదు యాడేడ ఏమున్నాయో అన్నీ అమ్ముకుని తింటాం.. గనులు అమ్ముతాం.. రైల్వేలు అమ్ముతాం.. ఆస్తులన్నీ అమ్మేసి కూర్చుంటామని చెబుతున్నారని ఆయన విమర్శించారు. ఒక వైపు ప్రభుత్వ ఆస్తులన్నీ అమ్ముతూ ఇక్కడకొచ్చి ఉద్యోగాలు ఇవ్వాలి అని అడుగుతారా..? అని ఆయన ప్రశ్నించారు. అరవింద్ కు హెచ్చరిక చేస్తున్నా.. ఇంకో రెండో నెలల్లో రైతుల్లో తిరుగలేవన్నారు. కేసీఆర్ కుటుంబాన్నీ తిట్టినవాల్లు ఎవరు మిగలలేదు.. మీ జీవితాలు అంతా అవినీతిమయం.. మీ ఇల్లు, మీ కారు అంతా అవినీతి డబ్బుతో కొన్నవే.. మీరు తింటున్న తిండి కూడా టీఆర్ఎస్ పెట్టిన బిక్ష.. మీ నాన్న డి.శ్రీనివాస్ కు టీఆర్ఎస్ ఎంపీగా జీతం వస్తే ఆ డబ్బుతో మీరు బ్రతుకుతున్నారు.. నిన్ను మెట్ పల్లి నుంచి నిజామాబాద్ దాకా జనం వెంటపడి కొడతారని జీవన్ రెడ్డి హెచ్చరించారు.  మొన్నటి వరకు అసెంబ్లీ l ఏకలింగం వుండే.. ఇప్పుడు ఇంకో బోడి లింగం వచ్చిండు.. ఇది ఆరంభం మాత్రమే..ఇంకా ఎక్కువ మాట్లాడితే నాలుక కోస్తం అని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి హెచ్చరించారు.