మంత్రి ప్రశాంత్ రెడ్డికి కస్టర్డ్ ఆపిల్ కు జామపండుకి తేడా తెల్వదన్నారు బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్. కవిత కాంగ్రెస్ నేతలని పొగుడుతుంటే మంత్రి ప్రశాంత్ మొహం వాడిపోయిందన్నారు. కేసీఆర్ దగ్గర మెప్పు పొందేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు కవితని పొగుడ్తుంటే... కవిత మాత్రం కాంగ్రెస్ వాళ్ళని పొగుడుతుందని ఎద్దేవా చేశారు. కవిత, మంత్రి ప్రశాంత్ పసుపు రైతులకు చేసిందేమి లేదన్నారు. పసుపు ఎగుమతులను పెంచాం కాబట్టే రైతులకు మంచి ధరలు వస్తున్నాయని చెప్పారు. ఈ సారి కవిత తనపై పోటీ చేస్తే మూడో స్థానానికే పరిమితం అవుతుందన్నారు.
కేసీఆర్ అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు అర్వింద్. మైనారిటీల సంక్షేమానికి కేంద్రం వేల కోట్లు ఇస్తున్నా.. బీజేపీ మైనారిటీలకు వ్యతిరేఖమని కొన్ని పార్టీలు దుష్ప్రచారం చేస్తున్నాయన్నారు. రాష్ట్రం బాగుండాలంటే కేసీఆర్ ని ఇంటికి పంపాలని సూచించారు. కేంద్రం పసుపు రైతుల బాగు కోసం పాటుపడుతుందని.. గ్రీస్ లో జరిగిన జీ20 సమ్మిట్ లో ప్రధాని నిజామాబాద్ పసుపుని ప్రస్తావించటమే ఇందుకు నిదర్శనమని చెప్పారు.