
జనగామ, వెలుగు: ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ త్వరలోనే అమలు చేస్తామని భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్ రెడ్డి అన్నారు. గురువారం జనగామ డీసీసీ ఆఫీస్ లో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డితో కలిసి సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. తమకు మరో మూడున్నరేళ్ల టైమ్ఉందని, ఇచ్చిన ప్రతీ హామీని నిలబెట్టుకుంటామని తెలిపారు.
ఏడాదిన్నరకే కొంప మునిగినట్లు బీఆర్ఎస్ గగ్గోలు పెడుతోందని
విమర్శించారు. గత పాలన అంతా కేసీఆర్ ఫాంహౌస్చుట్టే నడిచిందన్నారు. ప్రజలు డబ్బులను జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలనే ఉద్దేశంతోనే సీఎం రేవంత్రెడ్డి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అప్పులపై మాట్లాడారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ లీడర్లు చిల్లర రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేసేందుకు నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా ముందుకు సాగాలని సూచించారు.
రైల్వే అభివృద్ధి పనులు స్పీడప్చేయండి
జనగామ రైల్వే స్టేషన్అభివృద్ధి పనులు స్పీడప్ చేయాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్రెడ్డి ఆదేశించారు. గురువారం పనులను పరిశీలించిన అనంతరం రైల్వే డీజీఎం ఉదయ్ తో ఫోన్లో మాట్లాడారు. 2022లో ప్రారంభమైన సుందరీకరణ పనులు నేటికీ ఎందుకు పూర్తి కావడం లేదని ప్రశ్నించగా వచ్చే నవంబర్ లోగా కంప్లీట్ అయ్యేలా చర్యలు తీసుకుంటామని ఢీజీఎం చెప్పారన్నారు. యూత్ కాంగ్రెస్ స్టేట్ లీడర్కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి, నాయకులు మెరుగు బాలరాజు, చెంచారపు బుచ్చిరెడ్డి, మేడ శ్రీనివాస్, మోర్తాల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.