బీఆర్ ఎస్ అంటూ దేశ పర్యటనలు :​ ఎంపీ అర్వింద్​

బీఆర్ ఎస్ అంటూ దేశ పర్యటనలు :​ ఎంపీ అర్వింద్​
  • నిజామాబాద్​ ఎంపీ అర్వింద్​

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ​అన్ని వర్గాలను మోసం చేసి, బీఆర్ ఎస్ అంటూ దేశ పర్యటనలు చేస్తున్నడని నిజామాబాద్​ ఎంపీ అర్వింద్​ మండిపడ్డారు. తెలంగాణలో ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకుండా, కేంద్ర స్కీంల ప్రయోజనాలు ప్రజలకు అందకుండా చేస్తున్నదని ఎంపీ శనివారం ఓ ప్రకటనలో ఫైర్ అయ్యారు.పేద ప్రజలను దోచుకుంటున్న వారిని వదిలిపెట్టేది లేదని ప్రధాని స్పష్టంగా చెప్పారని ఆయన గుర్తుచేశారు.

సభలో పసుపు రైతుల గురించి ప్రధాని ప్రస్తావించినందుకు అర్వింద్​ ధన్యవాదాలు తెలిపారు. పసుపునకు కేంద్రం మద్దతు ధర పెంచాలని, ఇందుకు ప్రపోజల్స్ పంపాలని కేంద్రం అడుగుతుంటే రాష్ర్ట ప్రభుత్వం పంపడం లేదని ఆయన మండిపడ్డారు.  ఈఫసల్ బీమాను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదన్నారు.