డిజైన్లతో నాకు సంబంధం లేదు.. ఇరిగేషన్ శాఖనే చూసుకుంది: కాళేశ్వరం కమిషన్ తో ఈటల రాజేందర్

డిజైన్లతో నాకు సంబంధం లేదు.. ఇరిగేషన్ శాఖనే చూసుకుంది: కాళేశ్వరం కమిషన్ తో ఈటల రాజేందర్

కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరైన బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు.. కాళేశ్వరం డిజైన్లతో తనకు సంబంధం లేదని.. అంతా ఇరిగేషన్ శాఖ చేసుకుందని అన్నారు. కాళేశ్వరం బాధ్యులను శిక్షించాలని అన్నారు ఈటల. కాళేశ్వరం కార్పొరేషన్ తో కూడా ఆర్థిక మంత్రికి సంబంధం ఉండదని అన్నారు. బడ్జెట్ కేటాయింపులు మాత్రమే ఆర్థిక శాఖ బాధ్యత అని... కేటాయింపుల ప్రకారమే నిధులు ఇచ్చామని అన్నారు. కాళేశ్వరం డిజైన్, నిర్మాణం అంతా తానే చేసుకున్నట్లు కేసీఆర్ చెప్పారని.. అన్ని నిర్ణయాలకు కేసీఆర్ బాస్ అని అన్నారు. 

కాళేశ్వరం అవినీతిపై చర్యలు తీసుకోవాలని.. బాధ్యులను శిక్షించాలని కమిషన్ ను కోరినట్లు తెలిపారు ఈటల. కాళేశ్వరం ప్రాజెక్టులో తానేమీ చేయలేదని, తన దగ్గర ఏమీ లేదని అన్నారు. తెలంగాణకు మొట్టమొదటి ఆర్థిక మంత్రిగా పనిచేశానని, తెలంగాణ సమాజానికి 25ఏళ్లుగా సుపరిచితుడిని అని అన్నారు ఈటల. 2016లో తుమ్మడిహెట్టి ప్రాజెక్టు అంచనా రూ.16 వేల 500 కోట్లు అని, ఆ తర్వాత రూ. 38 వేల కోట్లకు పెరిగిందని అన్నారు.

తుమ్మడిహెట్టిపై మహారాష్ట్ర అభ్యంతరం వ్యక్తం చేసిందని.. ఆ ప్రాజెక్టు ద్వారా నీటి అవసరాలు తీరవని రిపోర్టులు వచ్చాయని అన్నారు ఈటల. ప్రత్యామ్నాయం చూడాలని ప్రభుత్వం కోరితేనే కాళేశ్వరం ఎంపిక చేశామని అన్నారు. టెక్నీకల్ అంశాలన్నీ పరిశీలించాకే కాళేశ్వరం నిర్ణయం తీసుకున్నామని అన్నారు. కాళేశ్వరానికి మొదట రూ. 63 వేల కోట్లు అంచనా వేయగా.. ఆ తర్వాత రూ. 83 వేల కోట్లకు పెరిగిందని... చివరికి ఎంతయ్యిందో తెలీదని అన్నారు ఈటల రాజేందర్.