- కరీంనగర్లో వరంగల్, నల్లగొండ మధ్య మ్యాచ్
కరీంనగర్/తిమ్మాపూర్, వెలుగు: గల్లీ క్రికెటర్లను నేషనల్ లెవల్కు తీసుకెళ్లడం మంత్రి వివేక్ వెంకటస్వామి డ్రీమ్ అని, అదే లక్ష్యంతో కాకా మెమోరియల్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు విశాఖ ఇండస్ట్రీస్ ఎండీ, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ వెల్లడించారు. ఐపీఎల్ మ్యాచ్లను తలపించేలా కాకా మెమోరియల్ ఇంటర్ డిస్ట్రిక్ట్ టీ-20 క్రికెట్ పోటీలు జరుగుతున్నాయని ప్రశంసించారు.
శనివారం కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని అలుగునూరులో గల వెలిచాల జగపతిరావు మెమోరియల్ గ్రౌండ్ లో వరంగల్, నల్లగొండ జట్ల మధ్య మ్యాచ్ను ఎంపీ వంశీకృష్ణ టాస్ వేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మంత్రి వివేక్ సారథ్యంలో కాకా టీ-20 క్రికెట్ టోర్నీ ఉత్సాహంగా సాగుతోందన్నారు. ఇప్పటి వరకు దాదాపు 70 మ్యాచ్లు నిర్వహించామని, ఇంకా 30కి పైగా మ్యాచ్లు ఉన్నాయన్నారు.
కరీంనగర్ లో కేడీసీఏ ప్రెసిడెంట్ ఆగంరావు నిర్మించిన గ్రౌండ్ సూపర్గా ఉందని కొనియాడారు. వరంగల్, నల్లగొండ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. టాస్ గెలిచిన వరంగల్ జట్టు మొదట బ్యాటింగ్కు దిగింది. ఆ తరువాత బ్యాటింగ్కు దిగిన నల్లగొండ జట్టు ఒక బాల్ మిగిలి ఉండగా లక్ష్యాన్ని సాధించి విన్నర్గా నిలిచింది.
ఈ కార్యక్రమంలో కరీంనగర్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు వి.ఆగంరావు, కార్యదర్శి మురళీధర్ రావు, ఉపాధ్యక్షులు మహేందర్ గౌడ్, మనోహర్ రావు, కోశాధికారి బండి శ్రవణ్ కుమార్, కార్యవర్గ సభ్యులు హరికృష్ణ గౌడ్, సాగర్ రావు, అజిత్ పాల్గొన్నారు.
