- కేంద్రానికి ఎంపీ కడియం కావ్య వినతి
న్యూఢిల్లీ, వెలుగు: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ) పరిధిలో రోడ్లు, డ్రైనేజీల పునరుద్ధరణకు రూ.100 కోట్లు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఎంపీ కడియం కావ్య కోరారు. బుధవారం జీరో అవర్లో ఆమె మాట్లాడుతూ.. జీడబ్ల్యూఎంసీ పరిధిలో 200 మిల్లీ మీటర్లకుపైగా వర్షం కురవడంతో 45 కాలనీలు నీట మునిగాయని, పలు రహదారులు దెబ్బతిన్నాయని తెలిపారు.
1,200 మందిని 12 పూనరావాస కేంద్రాలకు తరలించామని చెప్పారు. అమృత్, -స్మార్ట్ సిటీల స్కీమ్స్ కింద చేపట్టిన డ్రైనేజీ పనులు 66% పూర్తికావడంతో బాధితులు ఇబ్బందులు పడాల్సి వచ్చిందని పేర్కొన్నారు.
