భువనగిరిలో దళితబంధు ఇస్తే ఎంపీ పదవికి రాజీనామా చేస్తా

భువనగిరిలో దళితబంధు ఇస్తే ఎంపీ పదవికి రాజీనామా చేస్తా

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దళితుడినే సీఎం చేస్తామన్నారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. దళిత బంధుపేరుతో ప్రభుత్వం మోసం చేసే కుట్ర చేస్తోందన్నారు. యాదాద్రి జిల్లా రాంపూర్ తండాలో దళిత,గిరిజన ఆత్మగౌరవ దండోరా సభలో కోమట్ రెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడారు. దళితులకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కేసీఆర్ ఫెయిల్ అయ్యారని అన్నారు. దళిత గిరిజనులు ఓట్లేసే యంత్రాలుగా మిగిలిపోవద్దన్నారు.  భువనగిరి పార్లమెంట్ పరిధిలో దళిత,గిరిజన బంధు అమలు చేస్తే ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు.