హైదరాబాద్- కరోనా కారణంగా తెలంగాణలో పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు మృత్యువాత పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఈ క్రమంలోనే కరోనా బారినపడ్డ జర్నలిస్టులను, మరణించిన జర్నలిస్టుల కుటుంబాలను ఆదుకోవాలంటూ సీఎం కేసీఆర్ కు సోమవారం వెంకట్ రెడ్డి లేఖ రాశారు. కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటివరకు తెలంగాణాలో 100 మంది జర్నలిస్టులు కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. దేశం మొత్తంలో దాదాపు 15 రాష్ట్రాలలో జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్లుగా గుర్తించారని, వారికి ప్రత్యేకంగా బెడ్లు కేటాయించి, ఉచిత వైద్యం రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్నాయని తెలిపారు. కరోనాతో చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు ఆర్ధిక సహాయం కూడా చేస్తున్నాయన్నారు. కరోనాతో చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు వెంటనే ఆర్థిక సహాయం చేయాలని ఎంపీ కోమటిరెడ్డి తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో వారి ప్రాణాలను రక్షించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అన్నారు. ఇతర రాష్ట్రాలను స్ఫూర్తిగా తీసుకుని తెలంగాణ ప్రభుత్వం కూడా తక్షణమే జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్లుగా గుర్తించాలన్నారు. కరోనాతో జర్నలిస్టులు చనిపోతే వారి కుటుంబానికి రూ. 25 లక్షల ఆర్ధిక సహాయం చేయాలని కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కోరారు.
జర్నలిస్టులను ఆదుకోవాలంటూ కేసీఆర్ కు ఎంపీ కోమటిరెడ్డి లేఖ
- తెలంగాణం
- May 10, 2021
లేటెస్ట్
- ఏంటీ కిరాతకం : పట్టపగలు.. నడి రోడ్డుపై వ్యాపారిపై కాల్పులు
- రణరంగం : పోలీస్ స్టేషన్ లో భార్యభర్తలు మృతి.. స్టేషన్ తగలబెట్టిన గ్రామస్తులు
- సుప్రీం కోర్టు తీర్పుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు.. ట్వీట్ వైరల్
- SA v WI: వెస్టిండీస్తో టీ20 సిరీస్.. ద్వితీయ శ్రేణి జట్టును ప్రకటించిన సౌతాఫ్రికా
- Vishwanetha: తెరపైకి మోదీ బయోపిక్.. విశ్వనేతగా కట్టప్ప
- వాట్సాప్లో డిలీటైయిన చాట్ ఇలా పొందొచ్చు
- తక్కువ ధరకే ఫ్లాట్స్ .. జనానికి రూ.60 కోట్లు టోకరా
- V6 DIGITAL 18.05.2024 AFTERNOON EDITION
- Deepika Padukone: దీపికా పదుకొణెకు అరుదైన గౌరవం..ఆ జాబితాలో తొలి భారతీయ నటిగా గుర్తింపు
- T20 World Cup 2024: టీమిండియాతో పాటు ఆ మూడు జట్లు సెమీస్కు చేరతాయి: జైషా
Most Read News
- స్వామియే శరణం అయ్యప్ప : 6.5 లక్షల ప్రసాదం డబ్బాలు ఎలా నాశనం చేయాలి..?
- Health alert : ఈ రక్త పరీక్ష చేస్తే.. క్యాన్సర్ వస్తుందా రాదా అనేది ఏడేళ్ల ముందే తెలుస్తుందంట..!
- IPL 2024: బెంగుళూరు చేతిలో ఓడినా ప్లేఆఫ్కు CSK.. పూర్తి లెక్కలివే
- కోర్టు వివాదంలో ల్యాండ్.. బారికెడ్లు తొలగించిన మల్లారెడ్డి.. పెట్ బషీరాబాద్ లో ఉద్రిక్తత
- AP Elections 2024: ఏపీలో ఎన్నికల వేళ అల్లర్లు.. విచారణకు సిట్ ఏర్పాటు
- SRH vs GT: మ్యాచ్ రద్దయిన ట్యాక్స్ కట్.. టికెట్ డబ్బు రీఫండ్లో SRH మేనేజ్మెంట్ మెలిక
- Forbes List 2024: దరిదాపుల్లో లేని కోహ్లీ.. అత్యధిక ఆదాయం పొందుతున్న టాప్ 10 అథ్లెట్లు వీరే
- సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య
- గ్రూప్-4 అభ్యర్థులకు అలర్ట్.. టీఎస్పీఎస్సీ కీలక ప్రకటన
- వెంకట్రామిరెడ్డిని డిస్ క్వాలిఫై చేయండి.. సీఈఓకు రఘనందన్ రావు ఫిర్యాదు