వికారాబాద్, వెలుగు: చేవెళ్ల పార్లమెంట్పరిధిలోని గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థులను సర్పంచ్లుగా గెలిపిస్తే ఎంపీ నిధుల నుంచి ఆయా గ్రామాల అభివృద్ధికి రూ.10 లక్షల చొప్పున మంజూరు చేస్తానని ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి తెలిపారు. ఆదివారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో బీజేపీ జిల్లా కోకన్వీనర్ శేరి శ్రీధర్రెడ్డి ఇంట్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
బాత్రూమ్క్లీనింగ్, రోడ్ల ప్యాచ్వర్క్చేసే, కోతులను పట్టుకునే ప్రత్యేక ట్రక్కులు తమ వద్ద ఉన్నాయని, వాటిని గ్రామాలకు పంపిస్తానన్నారు. అనంతరం జేకేఎంఆర్సంస్థ ద్వారా అందించిన కోతులు పట్టే వాహనాన్ని ప్రారంభించారు. కోతుల సమస్యను పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు.
అవసరమైతే కోతులను పట్టుకునేందుకు జేకేఎంఆర్ సంస్థ ద్వారా ట్రైనింగ్ కూడా ఇస్తామని తెలిపారు. బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు మాధవరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శివరాజ్, దిశ కమిటీ సభ్యుడు వడ్ల నందు, నాయకులు పాండుగౌడ్, విజయభాస్కర్ రెడ్డి, వివేకానందరెడ్డి, సుచరితా రెడ్డి, నరోత్తంరెడ్డి, అనిల్యాదవ్, రాచ శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
