బీజేపీతోనే బీసీలకు న్యాయం: ఎంపీ లక్ష్మణ్​

బీజేపీతోనే బీసీలకు న్యాయం: ఎంపీ లక్ష్మణ్​

జీడిమెట్ల, వెలుగు: రాష్ట్రంలో బీసీలకు న్యాయం జరగాలంటే  బీజేపీని గెలిపించాలని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ కోరారు. మంగళవారం కొంపల్లిలోని ఏఎంఆర్ గార్డెన్స్ లో బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. చీఫ్ గెస్టుగా హాజరైన లక్ష్మణ్ మాట్లాడుతూ.. బీసీలకు న్యాయం చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన  బీఆర్ఎస్.. ఇప్పుడు వారి అభివృద్ధిని పట్టించుకోవట్లేదన్నారు.

 రాష్ట్రంలో 52 శాతం ఉన్న బీసీలకు దశాబ్దాలుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా చేసిందేమీ లేదన్నారు. బీసీ బంధును కొందరికే ఇవ్వడం దారుణమన్నారు. అర్హులందరికీ బీసీ బంధు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీ, బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్, పార్టీ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు మల్లారెడ్డి పాల్గొన్నారు.