గౌరవం ఎలా ఇవ్వాలో నన్నుచూసి నేర్చుకోండి

గౌరవం ఎలా ఇవ్వాలో నన్నుచూసి నేర్చుకోండి

మున్సిపల్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో టీఆర్ఎస్ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు భాస్కర్ యాదవ్ అధ్యక్షతన విజయోత్సవ సభ జరిగింది. ఈ సందర్భంగా  ముఖ్య అతిధిగా హాజరైన మంత్రి మల్లారెడ్డి మల్లారెడ్డి మాట్లాడుతూ..నన్ను చూడండి, మా పిల్లలను చూసి ప్రజలతో ఎలా మర్యాదగా, గౌరవంగా ఉండాలో నేర్చుకోండని  టీఆరెస్ నేతలకు దిశా నిర్దేశం చేశారు.  ఎన్నికలలో గెలిచినంత మాత్రాన కళ్లను తలకెక్కించుకోవద్దు, ఎన్నికలకు ముందు ప్రజల దగ్గరికి ఏ విధంగానైతే వెళ్లామో ఇప్పుడు కూడా ప్రజల మధ్యనే ఉంటూ వారి సమస్యలు తీర్చాలని అన్నారు.

ఎన్నికలలో గెలిచిన మహిళలు ఇంటి బాధ్యతలను భర్తలకు అప్పచెప్పాలి,  ప్రజల సమస్యలు తీర్చే భాధ్యతను చేపట్టాలని కోరారు.  కార్పొరేటర్లను ఇంటికి పరిమితం చేసి భర్తలు అధికారం చెలాయించాలని చుస్తే సహించేది లేదని సున్నితంగా మందలించారు మంత్రి మల్లారెడ్డి