సీఎంగా కేసీఆర్ హ్యాట్రిక్​ ఖాయం : నామా నాగేశ్వరరావు

సీఎంగా కేసీఆర్ హ్యాట్రిక్​ ఖాయం : నామా నాగేశ్వరరావు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: వచ్చే ఎన్నికల్లో సీఎంగా కేసీఆర్ హ్యాట్రిక్​ సాధించడం ఖాయమని ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. శనివారం జిల్లాలోని కొత్తగూడెం, లక్ష్మీదేవిపల్లి, చుంచుపల్లి మండలాల్లో ఎంపీ నామా శనివారం పర్యటించారు. చుంచుపల్లి మండలంలోని ఎన్​కే నగర్​లోని బీఆర్ఎస్​ నేత బిక్కసాని నాగేశ్వరరావు సోదరి భాగ్యమ్మ ఇటీవల మృతి చెందారు.

వారి కుటుంబాన్ని ఎంపీ పరామర్శించారు. కొత్తగూడెంలోని ఎంజీ రోడ్​లో గల డాక్టర్​కృష్ణ ప్రసాద్​, డాక్టర్​ సుబ్బారావుల తల్లి ఇటీవల మృతి చెందడంతో వారిని పరామర్శించారు. మృతురాలి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. లక్ష్మీదేవిపల్లి మండలంలోపలు కుటుంబాలను  ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నివర్గాల సంక్షేమానికి రాష్ట్రంలోని బీఆర్ఎస్​ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఆయన వెంట జడ్పీ వైస్​ చైర్మన్​ కంచర్ల చంద్రశేఖర్​, ఎంపీపీ బదావత్​ శాంతి, నాయకులు లగడ పాటి  రమేశ్, కొట్టి వెంకటేశ్వర్లు, కృష్ణ, రాజేంద్ర ప్రసాద్, జగన్,  తదితరులు ​ పాల్గొన్నారు.