పార్లమెంట్ వద్ద ఎంపీ నవనీత్ కౌర్ నిరసన

పార్లమెంట్ వద్ద ఎంపీ నవనీత్ కౌర్ నిరసన

పార్లమెంట్ ఉభయసభల్లో కార్యకలాపాలను అడ్డుకోవద్దంటూ గాంధీజీ విగ్రహం ముందు ప్రదర్శన నిర్వహించారు ఇండిపెండెంట్ ఎంపీ నవనీత్ కౌర్. రెండు చేతుల్లో రెండు ప్లకార్డులు పట్టుకుని ప్రదర్శన చేశారు. పార్లమెంట్ లో ప్రజా సమస్యలపై, ప్రజలకు ఉపయోగపడే అనేక అంశాలపై చర్చ జరగాల్సి ఉందని.. దాన్ని అడ్డుకోవడం సరికాదంటూ ప్లకార్డుల్లో రాశారు నవనీత్ కౌర్. పెగాసస్ ఇష్యూ, వ్యవసాయచట్టాల రద్దు కోరుతూ విపక్షాలు సభలో ఆందోళన చేస్తున్నాయి. దీంతో సభా కార్యకలాపాలు జరగడం లేదు. సెషన్ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు వాయిదాలే కొనసాగుతున్నాయి.