- అది ప్రజల ఆఫీసు.. దానిని ధ్వంసం చేస్తరా?
- వయనాడ్ ఆఫీసును ధ్వంసం చేయడంపై రాహుల్
వయనాడ్(కేరళ): వయనాడ్లోని ఎంపీ కార్యాలయం ప్రజలదని, దానిని ధ్వంసం చేయడం సరికాదని కాంగ్రెస్ నాయకుడు రాహుల్గాంధీ అన్నారు. స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎస్ఎఫ్ఐ) పిల్లలు బాధ్యతారహితంగా ప్రవర్తించారని అన్నారు. శుక్రవారం వయనాడ్లో ధ్వంసమైన తన కార్యాలయాన్ని రాహుల్ గాంధీ సందర్శించారు. తన ఆఫీసును కూల్చేసినా ఎస్ఎఫ్ఐ పిల్లలపై ఎలాంటి కోపం లేదని స్పష్టం చేశారు. హింసతో సమస్యలకు పరిష్కారం లభించదనే విషయాన్ని వారు గుర్తుంచుకోవాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం ప్రస్తుతం రాహుల్గాంధీ కేరళలో పర్యటిస్తున్నారు. మరోవైపు నుపూర్ శర్మను ఉద్దేశించి సుప్రీంకోర్టు చేసిన కామెంట్లపై రాహుల్ స్పందిస్తూ.. దేశంలో విద్వేష, హింసాత్మక వాతావరణాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నెలకొల్పిందంటూ మండిపడ్డారు.