నిరుద్యోగుల ఉసురు పోసుకున్న కేసీఆర్ కు బుద్ధి చెప్తం

నిరుద్యోగుల ఉసురు పోసుకున్న కేసీఆర్ కు బుద్ధి చెప్తం
  • నిరుద్యోగుల ఉసురు పోసుకున్న కేసీఆర్ కు బుద్ధి చెప్తం
  • మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి 

కూకట్ పల్లి, వెలుగు: యువత త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ పేరుతో కేసీఆర్​దోచుకుంటున్నాడని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి మండిపడ్డారు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ నోటిఫికేషన్ల పేరుతో నిరుద్యోగులు, యువతను మభ్య పెడుతున్న కేసీఆర్​ఆటలు ఇక సాగవన్నారు. నిరంకుశ వైఖరితో ప్రజల గొంతు నొక్కుతున్న బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్​కు బుద్ధి చెప్పి గద్దె దించడానికి యువత సిద్ధంగా ఉందన్నారు. ‘యూత్​కెన్​లీడ్’ అనే సంస్థ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం కూకట్​పల్లి ఎల్లమ్మబండలోని ఓ ఫంక్షన్​హాల్​లో ఏర్పాటు చేసిన రాజకీయ అవగాహన సదస్సుకు పొంగులేటి చీఫ్​గెస్ట్​గా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుద్యోగ భృతి అంటూ యువతను మభ్యపెడుతున్న కేసీఆర్ మాటలను నమ్మొద్దన్నారు. మంత్రి మల్లారెడ్డి లాంటి వారి ప్రయోజనం కోసం ప్రైవేటు కాలేజీలు, ఆసుపత్రులు ఏర్పాటు చేసి విద్య, వైద్యాన్ని పేదలకు దూరం చేసిన ఘనుడు కేసీఆర్​అని తీవ్రస్థాయిలో విమర్శించారు. టీఎస్ పీఎస్సీ పేపర్​లీకేజీ వెనుక పెద్ద కుట్ర ఉందని, అది బయటకు రాకుండా విచారణ పేరుతో ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఆరోపించారు. అన్యాయానికి గురవుతున్న యువత  అధికారం కోసం పోరాడాలని  పిలుపునిచ్చారు. సభలో పిడమర్తి రవి, యూత్​ కెన్​లీడ్ ​సంస్థ వ్యవస్థాపకుడు రఘునాథ్​యాదవ్​ పాల్గొన్నారు.