రైతులకు అండగా మోదీ ప్రభుత్వం : ఎంపీ రఘునందన్ రావు

రైతులకు అండగా మోదీ ప్రభుత్వం : ఎంపీ రఘునందన్ రావు

జిన్నారం, వెలుగు: దేశవ్యాప్తంగా 11 కోట్ల చిన్న, సన్న కారు రైతులకు నరేంద్ర మోదీ ప్రభుత్వం అండగా నిలుస్తుందని, ఐదెకరాల లోపు ఉన్న రైతులకు మూడు విడతల్లో రూ.6 వేల అందిస్తున్నదని ఎంపీ రఘునందన్​రావు అన్నారు. మంగళవారం మండలంలోని మాదారం గ్రామంలో రైతులతో సంభాషణ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అంజిరెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. అప్పటి కాంగ్రెస్ పాలనలో రెండున్నర లక్షల మంది దేశవ్యాప్తంగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, యూరియా కోసం ఎన్నో కొట్లాటలు జరిగాయని గుర్తు చేశారు. 11 సంవత్సరాల మోదీ ప్రభుత్వంలో ఏనాడు యూరియా కొరతా చూడలేదని రైతుల కోసం ఎన్నో సంస్కరణలు చేసి, మద్దతు ధరను పెంచిన ఘనత మోదీదని అన్నారు. 

అనంతరం నాయకులతో కలిసి మొక్కను నాటారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు గోదావరి అంజిరెడ్డి, రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి, జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు రాజేందర్ రెడ్డి, బీజేపీ నాయకుడు రవీందర్, జిల్లా ఉపాధ్యక్షుడు ప్రతాపరెడ్డి, వెంకట నరసింహారెడ్డి, రాములు, రాజశేఖర్ రెడ్డి, మాణిక్ రావు, మండల పార్టీ అధ్యక్షుడు జగన్ రెడ్డి , రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు.