
- ఎంపీ రంజిత్ రెడ్డి శంకర్పల్లిలో సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన
శంకర్పల్లి, వెలుగు: రాష్ట్రానికి ఇస్తామన్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం కక్ష సాధిస్తోందని చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం కొండకల్గ్రామంలో గురువారం సీఎం కేసీఆర్ పర్యటన దృష్ట్యా అక్కడ చేపట్టిన ఏర్పాట్లను ఎంపీ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విభజన చట్టంలోని హామీలను కేంద్రం విస్మరించిందని, ఇది కక్ష సాధింపు చర్యేనని అన్నారు.
రైల్వే కోచ్ఫ్యాక్టరీ కోసం కొండకల్ గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం వంద ఎకరాలను కేటాయించి, కేంద్ర ప్రభుత్వ సహకారం లేకుండానే రైల్వే కోచ్లను తయారు చేసే అతి పెద్ద సంస్థను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రంజిత్ రెడ్డి వెంట స్థానిక ఎంపీపీ గోవర్ధన్రెడ్డి తదితరులు ఉన్నారు. కొండకల్లో రైల్వే కోచ్ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్రానున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్హరీశ్ భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా ఫ్యాక్టరీ యాజమాన్యంతో సమన్వయం చేసుకుంటూ ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.