కోమటిరెడ్డి బ్రదర్స్కు ఏ బ్రాండ్ లేదు..అంతా కాంగ్రెస్ బ్రాండే

కోమటిరెడ్డి బ్రదర్స్కు ఏ బ్రాండ్ లేదు..అంతా కాంగ్రెస్ బ్రాండే

మునుగోడు ప్రజల విశ్వాసాన్ని రాజగోపాల్ రెడ్డి పోగొట్టుకున్నారని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రాజగోపాల్ రెడ్డి చర్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ లో ఉంటే జరగని అభివృద్ది.. బీజేపీ లోకి వెళ్తే జరుగుతుందా అని ప్రశ్నించారు. మునుగోడు నియోజకవర్గ ప్రజలకు కాంగ్రెస్ నాయకులు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మునుగోడులో ఎప్పుడు ఎన్నికలోచ్చిన కాంగ్రెస్ నే గెలిపించాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 12 స్థానాల్లో కాంగ్రెస్ గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. 

కోమటిరెడ్డి బ్రదర్స్పై మాజీమంత్రి దామోదర్ రెడ్డి ఫైర్

కోమటిరెడ్డి బ్రదర్స్పై మాజీమంత్రి దామోదర్ రెడ్డి ఫైర్ అయ్యారు. 1999కి ముందు కోమటిరెడ్డి బ్రదర్స్ ఎక్కడున్నారని నిలదీశారు. గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి పై ఎన్నోసార్లు నోరుపారేసుకున్నారని.. ఆయన చరిత్ర అంతా తనకు తెలుసన్నారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అమిత్ షా చుట్టూ ఎందుకు తిరుగుతున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కోమటిరెడ్డి బ్రదర్స్ పార్టీని వీడినంత మాత్రానా పార్టీకి  ఎటువంటి నష్టంలేదన్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ కు బ్రాండ్ ఏంలేదని..అంతా కాంగ్రెస్ బ్రాండేనని అన్నారు.