
- పెద్దపల్లి జిల్లాలో ఎంపీ వంశీకృష్ణ పర్యటన
పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లాలో ఎంపీ గడ్డం వంశీకృష్ణకు కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. బుధవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా పర్యటనకు వెళుతున్న ఆయనకు పెద్దపల్లి జిల్లా కేంద్రంతో పాటు సుల్తానాబాద్, మంథనిలో అభిమానులు, కాంగ్రెస్ లీడర్లు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. స్థానిక రాజీవ్ రహదారిపై కాకా విగ్రహాల వద్ద ఎంపీని శాలువాలు పూలమాలతో సత్కరించారు.
ఈ సందర్భంగా ఎంపీ వంశీకృష్ణ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్రెడ్డి అమలు పరుస్తున్న సంక్షేమ పథకాలను క్షేత్ర స్థాయిలో ప్రజలకు వివరించాలని సూచించారు. వేర్వేరుగా జరిగిన కార్యక్రమంలో నాయకులు సయ్యద్ సజ్జద్, మల్లికార్జున్, ఉప్పు రాజు, బాలసాని సతీశ్, బండారి సునీల్, గంగుల సంతోష్, తిరుపతి, కొండి సతీశ్, అడ్డగుంట శ్రీనివాస్, విజయ్, నీరటి శంకర్, కనుకుంట్ల శ్రీనివాస్, ముస్తఫా, కరుణాకర్ పాల్గొన్నారు.