తెలుగు నై..ఇక అన్నిస్కూళ్లలో ఇంగ్లీష్ చదువులే

తెలుగు నై..ఇక అన్నిస్కూళ్లలో ఇంగ్లీష్ చదువులే

ఆంద్రప్రదేశ్ లోని అన్ని ప్రభుత్వ స్కూళ్లలో తెలుగు మీడియానికి పుల్ స్టాప్ చెబుతుంది ప్రభుత్వం. 2020-2021 అకాడమిక్ ఇయర్ నుంచి 1 నుండి 8 వ తరగతి వరకు అన్ని ప్రభుత్వ ఎంపీపీ, జిల్లాపరిషత్ స్కూళ్లలో  తెలుగు కాకుండా ఇంగ్లీష్ మీడియం చెప్పాలని నిర్ణయించింది. ఇకపై తెలుగు,ఉర్దును కేవలం సబ్జెక్ట్ లు గా మాత్రమే చెప్పనుంది. 2021-2022 అకాడమిక్ ఇయర్ నుంచి 9,10 తరగతులకు కూడా వర్తింప జేయనుంది. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.  ఇప్పటి వరకు తెలుగు మీడియంలో క్లాసులు చెప్పిన టీచర్లకు డిసెంబర్ నుంచి  దశల వారీగా ట్రైనింగ్ ఇచ్చేందుకు ప్లాన్  చేస్తుంది ప్రభుత్వం.