
ఆంద్రప్రదేశ్ లోని అన్ని ప్రభుత్వ స్కూళ్లలో తెలుగు మీడియానికి పుల్ స్టాప్ చెబుతుంది ప్రభుత్వం. 2020-2021 అకాడమిక్ ఇయర్ నుంచి 1 నుండి 8 వ తరగతి వరకు అన్ని ప్రభుత్వ ఎంపీపీ, జిల్లాపరిషత్ స్కూళ్లలో తెలుగు కాకుండా ఇంగ్లీష్ మీడియం చెప్పాలని నిర్ణయించింది. ఇకపై తెలుగు,ఉర్దును కేవలం సబ్జెక్ట్ లు గా మాత్రమే చెప్పనుంది. 2021-2022 అకాడమిక్ ఇయర్ నుంచి 9,10 తరగతులకు కూడా వర్తింప జేయనుంది. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు తెలుగు మీడియంలో క్లాసులు చెప్పిన టీచర్లకు డిసెంబర్ నుంచి దశల వారీగా ట్రైనింగ్ ఇచ్చేందుకు ప్లాన్ చేస్తుంది ప్రభుత్వం.
Govt of Andhra Pradesh: However, the Commissioner of School Education shall take appropriate & adequate efforts to implement Telugu/Urdu as compulsory subject depending on the current medium of instruction in all the schools compulsorily in line with the govt orders in the matter https://t.co/ZAyeXWdX7c
— ANI (@ANI) November 5, 2019