
- రాజకీయాలకు అతీతంగా ఎంపీలు, ఎమ్మెల్యేల పిలుపు
హైదరాబాద్, వెలుగు: గ్రామీణ ప్రాంతాల్లో సౌరశక్తి వినియోగాన్ని పెంచి అక్కడి ప్రజలను స్వయం సాధికారత దిశగా ప్రోత్సహించాలని పార్టీలకు అతీతంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు పిలుపునిచ్చారు. మంగళవారం హైదరాబాద్ లోని ఓ హోటల్ లో ‘భారత సౌరీకరణ ప్రస్థానంలో ప్రజాప్రతినిధుల పాత్ర’ అనే అంశంపై స్వానితి ఇనీషియేటివ్ ఆధ్వర్యంలో సెమినార్ జరిగింది.
ఎంపీలు బలరాం నాయక్, మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, రఘురాం రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, ఎమ్మెల్యేలు మేఘా రెడ్డి, వేముల వీరేశం, కుంభం అనిల్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ దేశంలో సౌరశక్తి మార్పును వేగవంతం చేయడంలో ప్రజాప్రతినిధుల పాత్ర కీలకంగా ఉండాలన్నారు. రాష్ట్రంలో సౌరశక్తి వినియోగాన్ని ఎలా వేగవంతం చేయాలనే దానిపై ఎంపీలు, ఎమ్మెల్యేలు పలు సలహాలు, సూచనలు చేశారు. దేశం లో పునరుత్పాదక ఇంధనం దిశగా చేపట్టాల్సిన చర్యలపై ఇందులో చర్చించారు.