త్రిగుణ్, పాయల్ రాధాకృష్ణ జంటగా మధుదీప్ చెలికాని దర్శకత్వంలో అరవింద్ మండెం నిర్మించిన చిత్రం ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’. శ్రీ వెంకట సాయి ఫిల్మ్స్, ముత్యాల రామదాస్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా మే 15న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ఈవెంట్లో త్రిగుణ్ మాట్లాడుతూ ‘సమ్మర్లో ఫ్యామిలీ అంతా కలిసి ఎంజాయ్ చేసే ఫీల్గుడ్ ఎంటర్టైనరే ఈ చిత్రం. రీసెంట్గా ప్రధాని మోదీ గారు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయమని చెప్పడం ఈ సినిమాకు మంచి బజ్ వచ్చింది.
ఐటీ జాబ్ వదిలేసిన ఓ కుర్రాడు వ్యవసాయం చేయాలనుకుంటే తన ఇంటి నుంచి, ఫ్యామిలీ నుంచి, అలాగే తన ప్రేమించిన అమ్మాయి నుంచి ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు, వాటిని ఎలా పరిష్కరించుకున్నాడు అనేది ఈ సినిమాలో వినోదాత్మకంగా చెప్పాం. తప్పకుండా అందరికీ నచ్చుతుందని భావిస్తున్నా’ అని అన్నాడు.
ఈ సినిమా తనకు చాలా స్పెషల్ అని హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ చెప్పింది. కమర్షియల్ ఎలిమెంట్స్తోపాటు సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చే చిత్రమిది అని డైరెక్టర్ మధుదీప్ అన్నాడు. మంచి కాన్సెప్ట్తో వస్తోన్న ఈ చిత్రానికి ప్రేక్షకుల ఆదరణ దక్కుతుందని నిర్మాత అరవింద్ అన్నారు. డిస్ట్రిబ్యూటర్ రామదాస్, నటులు అనీష్ కురువిల్లా, గుండు సుదర్శన్, బాబ్జీ పాల్గొన్నారు.
