
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోని అరుదైన ఘనత సాధించాడు. చిదంబరం స్టేడియం వేదికగా ఏప్రిల్ 03న లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్ లో ధోని వరుసగా రెండు సిక్సర్లు బాది ఐపీఎల్లో 5,000 పరుగులు పూర్తిచేసుకున్నాడు. ఈ ఘనత సాధించిన ఏడో బ్యాటర్గా, ఐదో భారత క్రికెటర్ గా రికార్డు సృష్టించాడు. ధోని కంటే ముందుగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, సురేశ్ రైనా, ఏబీ డివిల్లియర్స్, డేవిడ్ వార్నర్ ఈ ఫీట్ ను అందుకున్నారు.
విరాట్ కోహ్లీ 224 ఐపీఎల్లో మ్యాచ్లలో 6706 పరుగులు ఐపీఎల్లో చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా టాప్ లో ఉన్నాడు. ధావన్ (199 ఐపీఎల్ మ్యాచ్లలో పరుగులు), రోహిత్ (221ఐపీఎల్ మ్యాచ్లలో 5764 పరుగులు) చేశారు. లక్నోతో మ్యాచ్ కంటే ముందు ధోని (221ఐపీఎల్ మ్యాచ్లలో135 స్ట్రైక్ రేట్తో 4,978 పరుగులు చేశాడు. ఇందులో 24 అర్ధ సెంచరీలున్నాయి. ఇక ధోని ఇప్పటికే ఐపీఎల్లో మరో రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్లో అత్యధిక ఔట్ లు చేసిన ఘనత ధోనీదే. 170 డిస్మిసల్స్ చేయగా అందులో 131 క్యాచ్ లు, 39 స్టంపింగ్స్ ఉన్నాయి. ఆ తర్వాత డీకే 159 డిస్మిసల్స్ తో రెండో స్థానంలో నిలిచాడు.