టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మళ్లీ బ్యాట్ పట్టాడు. త్వరలో జరగనున్న ఐపీఎల్ కోసం ధోనీ ప్రాక్టీస్ స్టార్ట్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చాలా రోజుల తరువాత ధోనీ బ్యాట్ పట్టుకుని కనిపించడంతో ధోని అభిమానులు సంబర పడుతున్నారు. ఆగస్టు 15, 2020న అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన ధోనీ ఈ ఏడాది ఐపీఎల్కు రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ధోని ఇప్పటి వరకు ఐపీఎల్లో 135.20 స్ట్రైక్ రేట్తో 4978 పరుగులు చేశాడు. నాలుగు సార్లు చెన్నై జట్టుకు కప్ ను అందించాడు.