డ్రెస్సింగ్ రూమ్‌లో కోహ్లీని సర్‌ప్రైజ్ చేసిన ధోని 

డ్రెస్సింగ్ రూమ్‌లో కోహ్లీని సర్‌ప్రైజ్ చేసిన ధోని 

టీమిండియా కెఫ్టెన్ విరాట్ కోహ్లీని సర్ ప్రైజ్ చేశారు మాజీ కెఫ్టెన్ ధోని. టీట్వంటీలో  స్కాట్లాండ్‌పై భారత్ భారీ
విజయంతో కోహ్లీ సేన ఆనందంలో మునిగి తేలింది. శుక్రవారం దుబాయ్‌లో జరిగిన మ్యాచ్‌లో  86 పరుగుల
లక్ష్యాన్ని 6.3 ఓవర్లలోనే టీమిండియా రెండు వికెట్లు కోల్పోయి విక్టరీ కొట్టింది. అయితే శుక్రవారం రోజు విరాట్
కోహ్లీ బర్త్ డే కూడా కావడంతో మ్యాచ్ అనంతరం టీం అంతా సెలబ్రేషన్స్ చేసుకున్నారు. డ్రెస్సింగ్
రూమ్‌లో కోహ్లీ కోసం కేక్ సిద్ధం చేశారు మహేంద్ర సింగ్ ధోని. కోహ్లీ రాగానే కేక్ కట్ చేయించారు. దీంతో బర్త్ డే
కేక్ కట్ చేసిన కోహ్లీ ముందుగా కేక్‌ను ధోనికి తినిపించారు. ఈ వేడుకల్లో టీమిండియా మొత్తం సందడి చేశారు.

కోహ్లీ ఈ ఏడాది 33వ వసంతంలోకి అడుగు పెట్టాడు. ఇండియన్ డ్రెస్సింగ్ రూములో జరిగిన ఈ వేడుకలకు ధోనీ దగ్గరుండి ఏర్పాట్లు చేశాడు.  టీమిండియా సహచరులతో కలిసి బర్త్ డే విషెస్ చెప్పాడు. కోహ్లీ బర్త్ డే సెలబ్రేషన్స్‌కు సంబంధించిన వీడియోను బీసీసీఐ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. టీమిండియా క్రికెటర్లు సూర్యకుమార్ యాదవ్, వరుణ్ చక్రవర్తి పోస్టు చేసిన ఇన్‌స్టాగ్రామ్ వీడియల్లో కోహ్లీ ముఖంపై కేక్ పూసివున్నట్టు కనిపించింది.   మరోవైపు తనకెంతో స్పెషల్ అయిన ఈరోజున... తన ఫ్యామిలీతో గడపితే అదే తనకు పెద్ద గిఫ్ట్ అన్నాడు కోహ్లీ. మరోవైపు కోహ్లీ వైఫ్ అనుష్క, కూతురు వామిక కూడా టీట్వంటీ మ్యాచ్‌లు జరుగుతుండటంతో యూఏఈలోనే ఉన్నారు.