మిస్టర్ కూల్ ఎంఎస్. ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ అన్న వార్తలు వినిపిస్తున్నాయి. గత ఏడాది కూడా ఇలాంటి వార్తలే వినిపించినా.. మీడియా ముందుకు వచ్చి ఆ వార్తల్ని కొట్టి పడేశాడు. అయితే, ప్రస్తుతం వచ్చే వార్తలు నిజం అనడానికి వాస్తవాలు లేకపోలేదు. ప్రస్తుతం ధోనీ వయసు 41 సంవత్సరాలు. వచ్చే ఏడాది ఐపీఎల్ మొదలయ్యేనాటికి 42 పూర్తవుతాయి. దీనివల్ల ఫిట్ నెస్ లాంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం లేకపోలేదు.
అంతేకాకుండా.. తనకు ఇదే చివరి ఐపీఎల్ సీజన్ అని సోమవారం జరిగిని బెంగళూరు, చెన్నై మ్యాచ్ లో హింట్ ఇచ్చేశాడు మహి. మ్యాచ్ తర్వాత జరిగిన ఓ ఈవెంట్ లో తన రిటైర్మెంట్ పై రిపోర్టర్లు పలువురు ప్రశ్నలు అడిగారు.
ఆ ప్రశ్నలకు స్పందించిన ధోనీ ‘ రిటైలర్మెంట్ పై నిర్ణయం తీసుకోవడానికి చాలా టైం ఉంది. ప్రస్తుతం నేను ఈ సీజన్ లో చాలా మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. జట్టు కప్పును అందించడమే నా ప్రధాన లక్ష్యం. రిటైర్మెంట్ పై నేను ఇప్పుడు ఏదైనా చెప్తే కోచ్ ఒత్తిడికి గురవుతాడు. టీంలో కోఆర్డినేషన్ మిస్ అవుతుంది. అందుకే ఈ నిర్ణయాన్ని కొంతవరకు పోస్ట్ పోన్ చేయాలనుకుంటున్నా’ అని బదులిచ్చాడు.