Rashmika Mandanna: ఎమ్మెస్ సుబ్బలక్ష్మి బయోపిక్‌లో రష్మిక .. సాయి పల్లవి, రుక్మిణి అవుట్‌తో మారిన ఈక్వేషన్స్!

Rashmika Mandanna: ఎమ్మెస్ సుబ్బలక్ష్మి బయోపిక్‌లో రష్మిక .. సాయి పల్లవి, రుక్మిణి అవుట్‌తో మారిన ఈక్వేషన్స్!

భారతదేశం గర్వించదగ్గ ప్రఖ్యాత కర్ణాటక సంగీత విద్వాంసురాలు, గాయని, నటి భారతరత్న ఎమ్మెస్ సుబ్బలక్ష్మీ.  ప్రతి రోజూ  కోట్లాది మంది ఇళ్లలో, ఆలయాల్లో మారుమ్రోగే 'శ్రీ వేంకశ్వర సుప్రభాతం' ఆమె దివ్వగాత్రం నుంచి జాలువారింది. అయితే ఈ గానకోకిల జీవిత కథ ఆధారంగా ఓ భారీ బయోపిక్ తెరకెక్కించేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు. 'జెర్సీ' సినిమాతో జాతీయ అవార్డు అందుకున్న టాలెంటెడ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను హ్యాండిల్ చేస్తున్నారు.

ఎమ్మెస్ సుబ్బలక్ష్మి బయోపిక్‌లో..

అయితే ఈ సినిమాలో ఎమ్మెస్ సుబ్బలక్ష్మి పాత్రను ఎవరు పోషిస్తారనే దానిపై గత కొన్ని నెలలుగా సినీ ఇండస్ట్రీలో సస్పెన్స్ నడుస్తోంది. ఇప్పటికే పలువురు పేర్లు తెరపైకి వచ్చినా అవి వర్కౌంట్ కాలేదు. లేటెస్ట్ గా ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన ఒక వార్త ఫిలిం నగర్ సర్కిల్స్‌లో తెగ హల్‌చల్ చేస్తోంది. ఈ ప్రెస్టీజియస్ బయోపిక్‌లో లీడ్ రోల్ ప్లే చేయడానికి నేషనల్ క్రష్ రష్మిక మందన్నను ఎంపిక చేసినట్లు సమాచారం.. ఇటీవల ఈ పాత్రకు సంబంధించిన లుక్ టెస్ట్ కూడా సీక్రెట్‌గా జరిగిందట. సంప్రదాయబద్ధంగా ఉండే ఆ లుక్‌లో రష్మిక నటన చూసి మేకర్స్ ఫిదా అయ్యారని టాక్. అయితే దీనిపై చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

►ALSO READ | 38 ఏండ్లకే గుండె పోటుతో ప్రముఖ సింగర్ పెప్సీ శర్మ కన్నుమూత

మారిన ఈక్వేషన్స్..

నిజానికి ఈ బయోపిక్ అనౌన్స్ అయినప్పటి నుంచి ఎంతోమంది స్టార్ హీరోయిన్ల పేర్లు తెరపైకి వచ్చాయి. మొదట్లో ఈ పాత్రను నేచురల్ బ్యూటీ సాయి పల్లవి చేస్తుందని ప్రచారం జరిగింది. ఆమె కర్ణాటక సంగీతంలో క్లాసులు కూడా తీసుకుంటోందని, గౌతమ్ తిన్ననూరి రీసెర్చ్ వర్క్ పూర్తి కాగానే షూటింగ్ స్టార్ట్ అవుతుందని జోరుగా ప్రచారం జరిగింది. ఆ తర్వాత కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత పేరు తెరపైకి వచ్చింది. కానీ, ఫైనల్‌గా ఇప్పుడు ఆ లక్కీ ఛాన్స్ రష్మిక మందన్న చేతికి చిక్కినట్లు తెలుస్తోంది.

చేతినిండా ప్రాజెక్ట్‌లు..

వరుస ప్రాజెక్టులతో రష్మిక దూసుకెళ్తోంది. ఒకవైపు ఎమ్మెస్ సుబ్బలక్ష్మి బయోపిక్ రూమర్స్ షేక్ చేస్తుంటే.. మరోవైపు ఇటీవల నటించిన 'కాక్‌టెయిల్ 2'  ట్రైలర్ యూట్యూబ్‌ను ఊపేస్తోంది. ఈ ట్రైలర్‌కు వస్తున్న రెస్పాన్స్ చూసి రష్మిక ఎమోషనల్ అవుతూ సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్‌కు ధన్యవాదాలు తెలిపింది. అటు విజయ్ దేవరకొండతో కలిసి 'రణబాలి' నటిస్తుంది. ఒకవేళ ఈ బయోపిక్‌ను ఓకే చేస్తే ఆమె కెరీర్‌లోనే ఇదొక మైలురాయిగా నిలిచిపోవడం ఖాయమని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.