
న్యూఢిల్లీ: ఎంటీఆర్, ఈస్టర్న్ వంటి మసాలా బ్రాండ్లను అమ్ముతున్న ఓర్క్లా ఇండియా ఐపీఓకి వచ్చేందుకు రెడీ అయ్యింది. ఇందుకు సంబంధించిన ప్రిలిమినరీ పేపర్లను సెబీ వద్ద ఫైల్ చేసింది. ఈ పబ్లిక్ ఇష్యూలో పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) మాత్రమే ఉంటుంది. కంపెనీ ప్రమోటర్లు, ఇతర షేర్హోల్డర్లు సుమారు 2.28 కోట్ల ఈక్విటీ షేర్లను అమ్మనున్నారు. కంపెనీ ఫైల్ చేసిన డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (డీఆర్హెచ్పీ) ప్రకారం, ప్రమోటర్ ఓర్క్లా ఆసియా పసిఫిక్ పీటీఈ, షేర్హోల్డర్లు నవాస్ మీరాన్, ఫిరోజ్ మీరాన్లు షేర్లను విక్రయిస్తారు. ఇది ఓఎఫ్ఎస్ కాబట్టి, ఐపీఓ నుంచి వచ్చే డబ్బు అంతా షేర్లను అమ్మిన షేర్హోల్డర్లకే పోతుంది. మరోవైపు డిపాజిటరీ కంపెనీ ఎన్ఎస్డీఎల్ వచ్చే నెలలో ఐపీఓకి రానుంది.