- ముదిరాజ్ మహాసభ రాష్ట్ర నాయకుడు కాసాని వీరేశ్
పరిగి, వెలుగు: ముదిరాజ్లకు రావాల్సిన రాజకీయ వాటాను దక్కించుకోవాలని తెలంగాణ ముదిరాజ్మహాసభ రాష్ట్ర నాయకుడు కాసాని వీరేశ్ అన్నారు. వికారాబాద్ జిల్లా పరిగిలోని ఎస్ గార్డెన్స్లో శుక్రవారం నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు.చీఫ్ గెస్టుగా హాజరైన కాసాని జ్ఞానేశ్వర్ కొడుకు వీరేశ్ మాట్లాడుతూ.. తొందరలోనే నియోజకవర్గంలో ఎంత మంది ఓటర్లు ఉన్నారనే సర్వే నిర్వహించి రిపోర్టు తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తామన్నారు.
రాష్ట్రంలోని 38 నియోజకవర్గాల్లో అత్యధికంగా ముదిరాజ్ ఓటర్లు ఉన్నారన్నారు. తొందరలో నిర్వహించబోయే సర్వేకు సహకరించాలన్నారు. ప్రతి ఓటరు జాబితా,సెల్నంబర్తో రిపోర్టును తయారు చేసి డిజిటలైజేషన్ చేయనున్నామన్నారు. ముదిరాజ్లను బీసీ ‘డి’ నుంచి బీసీ ‘ఎ’ లోకి మార్చుకునేందుకు కృషి చేయాలన్నారు.