Mukesh Ambani: అంబానీ కొత్త వ్యాపార యుద్ధ వ్యూహం.. 60 కోట్ల మంది టార్గెట్..

Mukesh Ambani: అంబానీ కొత్త వ్యాపార యుద్ధ వ్యూహం.. 60 కోట్ల మంది టార్గెట్..

Reliance News: ముఖేష్ అంబానీ ప్లాన్ చేసి టార్గెట్ ఫిక్స్ చేస్తే వ్యాపారంలో తిరుగుండదు. ఎంత పెద్ద సంస్థలు పోటీలో ఉన్నా సులువుగా తన మాస్టమ్ మైండ్ వేసే ప్లాన్లతో వారిని మట్టికరిపిస్తుంటాడు. అంబానీకి ఇండియన్స్ వీక్ పాయింట్ అదే డిస్కౌంట్స్, ఉచితాలు, తక్కువ ధరలతో పడగొట్టడం గురించి బాగా తెలుసు. దానినే జియో లాంచ్ నుంచి ఓటీటీ ఫ్లాట్ ఫారం డిస్నీ హాట్ స్టార్ కొనుగోలు వరకు వాడారు. ఇటీవల ఆయన శీతలపానీయాల వ్యాపారం క్యాంపా కూడా బంపర్ హిట్ కావటంతో మరోకొత్త ప్లాన్ ద్వారా 60 కోట్ల మంది కస్టమర్లను మరోసారి టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. 

ప్రస్తుతం అంబానీకి చెందిన రిటైల్ వ్యాపారం కొంత ఒడిదొడుకుల్లో కొనసాగుతోంది. గడచిన ఏడాది కాలంగా కంపెనీ అనేక రిలయన్స్ రిటైల్ స్టోర్లను, పాయింట్లను క్లోజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అంబానీ తన ఎఫ్ఎంసీజీ విభాగం రిలయన్స్ కన్జూమర్ ప్రొడక్ట్స్ ద్వారా దేశంలోని 60 కోట్ల మంది కస్టమర్లకు చేరువయ్యేందుకు కొత్త ప్రణాళికతో ముందుకొస్తు్న్నారు. దీనికింద కంపెనీ మధ్యతరగతి భారతీయులను టార్గెట్ చేస్తూ నాణ్యమైన వస్తువులను, తక్కువ ధరలకు అందించాలని చూస్తోంది. ఇందుకోసం లోకల్ షాపులతో కలిపి పనిచేయాలని చూస్తోంది. 

లోకల్ కిరాణా షాపు యజమానులకు మంచి మార్జిన్లను అందించటం ద్వారా తమ ఉత్పత్తులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించినట్లు రిలయన్స్ కన్జూమర్ డైరెక్టర్ కృష్ణకుమార్ పేర్కొన్నారు. కంపెనీ వేస్తున్న ఈ అడుగులతో ఐటీసీ, నెస్లే, డాబర్, హిందుస్థాన్ యూనీలివర్ వంటి సంస్థలకు పోటీ ఇవ్వాలని చూస్తోంది. అయితే పైన పేర్కొన్న కంపెనీల ప్రీమియం ఉత్పత్తులకు భారీ కస్టమర్ బేస్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈసారి కూడా అంబానీ తక్కువ ధరలను కోరుకునే భారతీయ ఫ్యామిలీలను టార్గెట్ చేయాలని చూస్తున్నట్లు ప్రస్తుత ప్లాన్ ప్రకారం తెలుస్తోంది. ఎందుకంటే ప్రీమియం ఉత్పత్తులు కానప్పటికీ ఎక్కువగా ఉన్న మధ్యతరగతి ప్రజలు తమ ఉత్పత్తులను ఖచ్చితంగా తగ్గింపు రేట్లకు కొంటారని అంబానీ గట్టిగా నమ్ముతున్నారని తెలుస్తోంది.